చిరంజీవి హీరోగా వచ్చిన పసివాడి ప్రాణం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది సుజిత పలు సినిమాల్లో సీరియల్స్ లో నటించిన ఈమె ఎంతో సాంప్రదాయపద్ధంగా సినిమాల్లో నటిస్తూ ఎంతోమంది ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సుజిత అన్నయ్య సూర్యకిరణ్ కూడా ఇండస్ట్రీలో పనిచేశాడు. ఆయనకు సక్సెస్ రాకపోగా అనేక పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. నటుడుగానే కాకుండా దర్శకుడుగా కూడా పనిచేసిన సూర్యకిరణ్ బిగ్ బాస్ తెలుగు సీజన్4 లో కంటెస్టెంట్ గా వెళ్ళాడు.
బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన వారం రోజులకే ఎలిమినేట్ అయ్యాడు. ఇక అసలు విషయానికి వస్తే నటి కళ్యాణిని వివాహం చేసుకున్న సూర్య కిరణ్ కొన్నేళ్ళకే ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న సుజిత వీరి విడాకుల గురించి మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టింది. అన్నయ్యకు పెళ్లి అయిన మూడేళ్లకు నాకు పెళ్లి జరిగింది. నేను ఎక్కువగా షూటింగ్స్లో బిజీగా ఉండే దానిని అప్పుడప్పుడు మాత్రమే అన్నయ్యతో ఫోన్ మాట్లాడేదాన్ని అన్నయ్య నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నాడని వివరించింది.
హైదరాబాదుకు షూటింగ్ కు వచ్చినప్పుడు మాత్రం తనను నేరుగా కలిసేదాన్ని. ఇక వదిన అప్పటికే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఎంతో గుర్తింపు తెచ్చుకుందని మేమిద్దరం అక్క చెల్లెలు లాగా ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళమని వివరించింది. అయితే ఎంత అన్యోన్య దాంపత్యంలో ఆయన ఆర్థిక సమస్యలు అడుగుపెడితే చాలా కష్టమని ఆర్థిక సమస్యలను ఎదుర్కొనే శక్తి ఒకరిలోనైనా ఉండాలి అంటు చెప్పుకొచ్చింది.
వీరిద్దరూ అనవసరంగా పెద్ద విషయంలో ఇన్వాల్వ్ అయ్యారని అన్నయ్య నిర్మాతగా సినిమాలు రూపొందించాడని.. నాకు చెప్తే నేను సరే అన్నానని ఎందుకంటే ఆయన నాకన్నా 8ఏళ్ళు పెద్దవారు ఆయనకు సలహా ఇచ్చేంత పెద్దదాన్ని నేను కాదని ఊరుకున్నానని చివరికి వారు తీసిన సినిమాలు డిజాస్టర్ అవడంతో భారీ నష్టాలు ఎదుర్కో వాల్సి వచ్చిందని ఆ కారణంగానే వీరిద్దరూ అనేక సమస్యలను ఎదుర్కొన్నారని ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యన దూరం పెరిగిందని వివరించింది సుజిత. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.