టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ ప్రియమణి ఎవరే అతగాడు సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా హీరో ఎవరో కాదు క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కేఎస్. రామారావు తనయుడు అలెగ్జాండర్ వల్లభ. ఆ తర్వాత పెళ్లయిన కొత్తలో సినిమాతో మంచి విజయం అందుకుని ఆ తర్వాత ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో వచ్చిన యమదొంగ సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకుంది.
ఈ సినిమా దగ్గరనుంచి టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ఈ సినిమా తర్వాత నుంచి కొన్నేళ్లపాటు ఆమె ప్రయాణం టాలీవుడ్ లో బాగానే జరిగింది. కానీ చిత్ర పరిశ్రమలోకి కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చాక ఆమెకు అవకాశాలు తగ్గుకుంటూ వచ్చాయి. దీంతో ఆమె ఇతర పరిశ్రమలో సినిమాలు చేయడానికి బిజీగా మారింది. అక్కడ కూడా పలు సినిమాల్లో నటించాక అవకాశాలు తగ్గటంతో.. ఈమె ముస్తఫా రాజ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగు పెట్టింది.
ముస్తఫా రాజ్ ఓ ప్రముఖ వ్యాపారవేత్త పైగా తనకి ఇదివరకే వేరే అమ్మాయితో పెళ్లి కూడా జరిగింది. ఇదే విషయంపై ప్రేయమణి కాంట్రవర్సీ కూడా ఫేస్ చేసింది. ఈ విషయం ఇలా ఉంచితే గతంలో ప్రియమణి ఓ స్టార్ హీరోతో నాలుగు సంవత్సరాల పాటు ఎఫైర్ కొనసాగించిందట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు తరుణ్. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ల నవవసంతం అనే సినిమా కూడా వచ్చింది
ఆ సినిమా యావరేజ్ గా నిలిచింది. ఈ మూవీ షూటింగ్ టైంలోనే హీరోయిన్ ప్రియమణి, తరుణ్ మధ్య ప్రేమ పుట్టిందట. అది కూడా ఈ ఏకంగా నాలుగేళ్ల పాటు డేటింగ్ కూడా చేశారట. అంతేకాకుండా అంతకుముందే ప్రియమణికి ఓ సీనియర్ హీరోతో ఎఫైర్ మైంటైన్ చేయడంతో తరుణ్ తల్లిదండ్రులు వీరి పెళ్లికి ఒప్పుకోలేదని అంటారు. ఇక ఇందులో ఎంతవరకు నిజముందో ఎవరికీ తెలియదు. ఈ పుకార్లు అయితే అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి.