టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా తర్వాత చేస్తున్న భారీ సినిమా గుంటూరు కారం. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో ఈ సినిమా మొదలు పెట్టిన సమయంలోనే వరుసగా మహేష్ కుటుంబంలో జరిగిన విషాదాలు వలన షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరి ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టాడు మహేష్.
అంతేకాకుండా తన తండ్రి కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు చిన్న టీజర్ ని కూడా ప్రేక్షకులకు అందించాడు. గుంటూరు కారం అనే మాస్ టైటిల్ను త్రివిక్రమ్ ఈ సినిమాకు అనౌన్స్ చెయ్యగా టైటిల్ తోనే ఈ సినిమా ప్రేక్షకులో అంచనాలు పెంచేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో మహేష్ కు జంటగా పూజ హెగ్డే శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్రివిక్రమ్ హోం బ్యానర్ హారిక- హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే రెండు షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. తర్వాత నుంచి ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఇంకా ప్రారంభం కాలేదు. సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మాత్రం ఎవరికీ తెలియదు కానీ.. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ గా మారింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన చిన్న టీజర్ కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన కూడా వచ్చింది. టీజర్ లో మహేష్ బాబు ఎంతో రఫ్ అండ్ సాలిడ్ లుక్ లో కనిపించబోతున్నాడని అర్థమైంది.
తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఓ సీన్లో కూడా భారీ యాక్షన్ సీన్ ఉంటుందని తెలుస్తుంది. గుంటూరు మిర్చి యాడ్ నేపథ్యంలో ఈ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. ఇక అంతేకాకుండా ఈ ఫ్లాష్ బ్యాక్ లో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా బాగా ఉంటుందని అంటున్నారు .ఈ ఫ్లాష్ బ్యాక్ సినిమాకే ఎంతో హైలెట్ గా ఉంటుందనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక మరి త్రివిక్రమ్ ఈ సినిమాని ఏవిధంగా తెరకెక్కిస్తాడో చూడాలి.