టాలీవుడ్లో బలమైన దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన వారసుడు, నిర్మాత సురేష్బాబు రెండో కుమారుడు అభిరామ్ ఊరించి ఊరించి ఎట్టకేలకు అహింస సినిమాతో వెండితెరకు హీరోగా లాంచ్ అయ్యాడు. తేజ దర్శకత్వంలో యేడాదిన్నర నుంచి ఊరిస్తూ వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. నటుడిగాను అభిరామ్కు అనుకున్న మార్కులు పడలేదు. అటు సినిమా కూడా ఘోరంగా బాల్చి తన్నేసింది.
ఎంతో బలమైన బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా .. సురేష్ బాబు లాంటి అగ్ర నిర్మాత, పైగా కథలు ఎంచుకోవడంలో ఎంతో తెలివైన బ్యానర్ అయిన సురేష్ ప్రొడక్షన్స్ ఉన్నా కూడా అహింస హిట్ అవ్వలేదు సరికదా.. అభిరామ్కు తొలి సినిమాతోనే ఘోరమైన ప్లాప్తో పరువు తీసేసింది. ఇక తన రెండో కొడుకు అభిరామ్ను హీరోగా సక్సెస్ చేసే విషయంలో సురేష్బాబు చాలా స్ట్రిక్ట్ ఉన్నాడట.
తన రెండో సినిమా నుంచి కథల ఎంపికలో, దర్శకుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అభిరామ్ తర్వాత సినిమాల విషయంలో కొత్త దర్శకులతోనే పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలు కూడా రెండు, మూడు తేడా కొట్టేస్తే ఆ తర్వాత అభిరామ్ ఇక సినిమాలు చేసే ఛాన్స్ లేదని.. తన తండ్రి సురేష్బాబులా థియేటర్లు, నిర్మాణ రంగంలోకి ఎంటర్ అవుతాడని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
సురేష్బాబుకు వరుసగా ప్లాపులు వస్తుంటే అభిరామ్ను హీరోగా కంటిన్యూ చేయడం ఇష్టం ఉండదనే అంటారు. ఆ తర్వాత అభిరామ్కు సురేష్ ప్రొడక్షన్స్ బాధ్యతలు అప్పగించే ఆలోచనలోనే ఉన్నాడని కూడా తెలుస్తోంది. మరి మరో రెండు మూడు సినిమాల్లోగా అభిరామ్ హీరోగా తనను తాను ఫ్రూవ్ చేసుకుంటాడో ? లేదో చూడాలి.
ఒకవేళ అభిరామ్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తే శ్రీ రెడ్డి అభిరామ్ను టార్గెట్ గా చేసుకుని చేసే రచ్చ రంబోలా మామూలుగా ఉండదేమో అన్న సెటైర్లు కూడా సోషల్ మీడియాలో కంటిన్యూగా పడుతూనే ఉన్నాయి.