వైసీపీ సీనియర్ నాయకుడు మంత్రి ధర్మాన ప్రసాదరావుకు వైసిపి అధిష్టానం నుంచి పిలుపు అందినట్టు వైసిపి వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈసారి జగన్ నుంచి ఆయనకు పెద్ద క్లాసు తప్పదని కూడా వైసిపి వర్గాల్లోనే గుసగుసలు విపిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం గతం వారం రోజులుగా ధర్మాన ప్రసాదరావు చేస్తున్న వ్యాఖ్యలే అన్న చర్చి కూడా నడుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఆయన వరుసగా ఆసరా నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే నిధుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన లబ్ధిదారులైన మహిళలను ఉద్దేశించి ధర్మాన చేస్తున్న ప్రసంగాలు ఇప్పుడు తీవ్ర కాంట్రవర్సీ అవుతున్నాయి.
జగన్కు ఓటు వేయకపోతే మహిళలకు జీవితం లేదని.. చంద్రబాబు రూపాయి కూడా ఇవ్వడని తొలి రెండు మూడు రోజులు ధర్మాలు చెబుతూ వచ్చారు. ఆ తర్వాత ధర్మాన మరింత మాటల పదునుపెంచారు. అసలు మహిళలకు జీవితం ఇస్తున్నది జగనన్న.. ఆయనను గెలిపించకపోతే మీరు సర్వనాశనం అయిపోతారు అని.. చేసిన వ్యాఖ్య కూడా ఇప్పుడు మంట పుట్టిస్తోంది. అంతేకాదు జగన్ తన ఇంట్లో సొమ్ము ఇస్తున్నాడా ?అని కొందరు మహిళలు చేసిన వ్యాఖ్యలపైన ధర్మాన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలాంటి మాటలు మాట్లాడేవారు అసలు మహిళలేనా ? అని ఫైర్ అయ్యారు. ఇక ధర్మాన సభలు జరుగుతుంటే గేట్లు తాళం వేసి మరి బలవంతంగా ఎవరిని బయటకు వెళ్ళనవటం లేదు. చివరకు గేట్లు దూకి వెళ్లిపోతున్న మహిళలపై కూడా ధర్మాన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇవన్నీ గత వారం రోజులుగా మీడియాలో బాగా హైలెట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ధర్మాన వ్యవహార శైలిపై ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. అటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ధర్మాన వ్యాఖ్యలపై మహిళల్లోనే తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇటు సోషల్ మీడియాలోనూ హైలెట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే జగన్ ఆయనకు క్లాస్ పీకేందుకే అర్జెంట్గా ఫోన్ చేయించి మరి పిలిపించుకుంటున్నారని టాక్ ?