నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, టాలీవుడ్ మన్మధుడు నాగార్జున మేనకోడలు, సుప్రియ యార్లగడ్డ గురించి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ సినిమాతోనే సుప్రియ కూడా హీరోయిన్గా టాలీవుడ్కు పరిచయమైంది. అదే సమయంలో మొదటి సినిమాతోనే చిత్ర పరిశ్రమకు దూరమైంది. ఆ తర్వాత చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న సుప్రియ మళ్లీ అడివి శేష్ హీరోగా వచ్చిన గూఢచారి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది.
రీఎంట్రీలో తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది సుప్రియ. ఈ సినిమాలో సుప్రియ కీలకపాత్రలో నటించి మెప్పించింది. ఇదే సమయంలో ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన పేర్లు అడివి శేష్- సుప్రియ. గత కొంతకాలంగా వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారని ప్రచారం జోరుగా వినిపిస్తోంది. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా… రీసెంట్గా పలు వార్తలు వైరల్గా మారయి.
అదే సమయంలో సుప్రియ యార్లగడ్డకు ఇంతకుముందే ఒక పెళ్లి జరిగింది. ఇంతకీ ఈమె మొదటి భర్త ఎవరో కాదు చరణ్ రెడ్డి. ఇతను కూడా హీరోనే అన్న విషయం చాలా మందికి తెలియదు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాకు చెందిన చరణ్ రెడ్డి ఉషాకిరన్ మూవీస్ నిర్మించిన ఇష్టం సినిమాతో టాలీవుడ్ లో హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాలో శ్రీయ హీరోయిన్గా నటించింది. ఈమెకు కూడా ఇది తొలి సినిమానే.
ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. అలా చరణ్ తొలి సినిమా హీరోయిన్ శ్రీయ ఆ తర్వాత ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ అయిపోయింది. తర్వాత చరణ్ రెడ్డికి పెద్దగా అవకాశాలు కూడా రాలేదు. ఆ తర్వాత కొన్ని రోజులకు చరణ్ రెడ్డి- సుప్రియను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అంత పెద్ద ఇంటికి అల్లుడు అయిపోయాడు. చరణ్రెడ్డి మద్యానికి విపరీతంగా బానిస కావడంతో సుప్రియ, చరణ్ విడిపోయారు.
ఆ తర్వాత 2012 మార్చ్ 19న చరణ్ రెడ్డి చనిపోయాడు. ఆ సమయానికి సుప్రియ చరణ్ రెడ్డితో విడాకులు తీసుకుంది. భార్య దూరం కావడం వల్ల చరణ్ రెడ్డి మెంటల్గా డిప్రెషన్ కి వెళ్లి మద్యానికి బానిస అయ్యాడని.. ఆక్రమంలోనే ఆరోగ్యం చెడిపోయి గుండె పోటుతో మరణించాడన్న టాక్ కూడా ఇండస్ట్రీలో ఉంది.