డబ్బు కోసం అలాంటి పనిచేసిన అనుష్క… విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్‌గా అడుగుపెట్టింది అనుష్క. తొలి సినిమాతోనే తన నటన గ్లామర్‌తో ప్రేక్షకులను మెప్పించింది ఈ యోగా టీచర్. తర్వాత వరుస‌ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్‌లోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

అదే సమయంలో సీనియర్ దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ లోనే ఓ భారీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాతో అనుష్క ఏకంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలకు స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. అనుష్క బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో ఆదరగొట్టింది. బాహుబ‌లి సీరిస్‌, ఆ త‌ర్వాత సైజ్ జీరో సినిమాల తర్వాత కొంతకాలం సినిమాల‌కు అనుష్క దూరంగా ఉంది.

ఇదే సమయంలో అనుష్క కెరీర్ బిగినింగ్లో విలక్షణ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో వచ్చిన వేదం సినిమాలో ఈమె నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క ఒక వేశ్య పాత్రలో నటించింది. ఈ సినిమాలో అనుష్కతో ఒక ప్రత్యేక పాట కూడా ఉంటుంది.. అదే ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఈ పాట నేచురల్ గా రావడం కోసం దర్శకుడు క్రిష్ అనుష్కను ఏకంగా బ్రోతల్ హౌస్ కి తీసుకువెళ్లి మరి షూటింగ్ చేయించారట. అలా తీసుకెళ్లినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరిని చూసి అనుష్క ఎంతో చలించి పోయిందట.

అంతేకాకుండా వారి కష్టాలు చెప్పడంతో డబ్బు కోసం ఆడవాళ్లు ఇన్ని కష్టాలు పడతారా ? అంటూ కన్నీళ్లు పెట్టుకుని షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లి పోయిందట. ఇక తర్వాత ఆ భాద‌ నుంచి బయటపడి మళ్లీ షూటింగ్లో పాల్గొందట. ఇక ఇదే విషయాన్ని అనుష్క గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనుష్క యంగ్ హీరో వీన్ పోలిశెట్టితో కలిసి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసింది.