మెగా మేనల్లుడు సాయి ధరమ్తేజ్ మెగా బ్యాగ్రౌండ్ తో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. చిన్న చిన్న సినిమాల్లో హీరోగా నటిస్తూనే మంచి ఫాలోయింగ్తో దూసుకుపోతున్నాడు. సాయిధరమ్ తేజ్ ఇటీవల విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం సాయిధరమ్ మేనమామ పవన్ కళ్యాణ్తో చేస్తోన్న మల్టీస్టారర్ మూవీ బ్రో షూటింగ్లో బిజీగా ఉన్నాడు. సాయి తమ్ముడు వైష్ణవ్తేజ్ ఉప్పెన సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే స్టార్డం కొట్టేశాడు.
ఆ తర్వాత వైష్ణవ్ నటించిన సినిమాలేవి అంతగా హిట్ కాకపోవడంతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ శ్రీలీలతో ఆదికేశవ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ తన ఖాతాలో వేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ అన్నదమ్ముల ఫ్యామిలీ లైఫ్ విషయానికి వస్తే వైష్ణవ్ తేజ్, సాయి ధరమ్తేజ్ కలిసి వారి తల్లికి దగ్గరుండీ మరీ రెండో వివాహం చేశారట.
మెగాస్టార్ చిరంజీవి చెల్లి విజయదుర్గ కు మొదట్లో శివప్రసాద్ అనే వ్యక్తి వ్యక్తితో వివాహం అయ్యింది. తర్వాత కొంతకాలానికి ఏవో మనస్పర్ధలు కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. తర్వాత విజయదుర్గ ఒక్కరే తన ఇద్దరు కొడుకులు సాయి ధరమ్తేజ్, వైష్ణవ తేజ్ ను కష్టపడి పెంచింది. వారి కోసం తన జీవితాన్ని చాలా వరకు త్యాగం చేసింది.
తన కొడుకుల కోసం ఒంటరిగా జీవితాన్ని గడుపుతూ ఇద్దరిని పెంచిన విజయదుర్గకు ఈ వయస్సులో ఓ తోడు ఉండాలని కొడుకులే నిర్ణయం తీసుకున్నారట. ఎలాగైనా తమ అమ్మకు మళ్లీ వివాహం చేయాలని వైష్ణవ్తేజ్, సాయి ధరంతేజ్ గట్టి నిర్ణయం తీసుకున్నారట. దీంతో విజయదుర్గను ఒప్పించి దగ్గరుండి కేర్ హాస్పిటల్ కు చెందిన ఒక డెంటిస్ట్ కి ఇచ్చి వివాహం చేశారట. అది సాయితేజ్ అమ్మ రెండో పెళ్లి మ్యాటర్.