తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి గుర్తింపు తీసుకువచ్చిన దర్శక ధీరుడు రాజమౌళికి ఎన్ని హ్యాట్సాఫ్లు చెప్పినా తక్కువే. ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ అంటే జాతీయస్థాయిలో గుర్తింపు తక్కువ. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో తెలుగు చిత్ర పరిశ్రమ పేరు మారుమగు పోతుంది. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సీరిస్ సినిమాలు ఆ తర్వాత త్రిబుల్ ఆర్ తో మన క్రేజ్ ఎల్లలు దాటేసింది.
త్రిబుల్ ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డు తెలుగు చిత్ర పరిశ్రమకు వరించింది. ఈ సినిమాకు ఆస్కార్ రావటంతో రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. ఎంతోమంది హాలీవుడ్ డైరెక్టర్లు సైతం రాజమౌళి పై పొగడ్తల వర్షం కురిపించారు. సినీ ఇండస్ట్రీలో ఎవరికైతే స్టార్ హోదా ఉండి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ? అలాంటి వారిని పెద్ద పెద్ద కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుని.. వారి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేయించుకుంటాయి.
ఇలా పెద్ద కంపెనీల కమర్షియల్ యాడ్స్లో డైరెక్టర్లు నటించిన దాఖలాలు లేవు. కానీ మొట్టమొదటిసారిగా దర్శకదీరుడు రాజమౌళికి ఇలాంటి అవకాశం లభించింది. ఈయన కూడా ఓ కమర్షియల్ యాడ్ చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ యాడ్ షూటింగ్ పనులు కూడా ఎంతో శరవేగంగా జరుగుతున్నాయి. ఈ షూట్ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇందులో రాజమౌళి ఎంతో స్టైలిష్గా షూట్ వేసుకుని ఇరగదీశాడు. స్టైల్ గా ఫోన్ తిప్పుతూ నడుస్తూ ఎంతో హంగామా చేశారు. రాజమౌళి ఒప్పో ఫోన్ కంపెనీ కోసం యాడ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా మొట్టమొదటిసారిగా ఒప్పో మొబైల్ ఫోన్కి రాజమౌళి బ్రాండ్ అంబాసిడర్ గా మారిబోతున్నాడన్న విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది.
#Rajamouli Acting In a Ad? video goes viral.. for Oppo Brand.. Watch this one..#Rajamouli #rajamoulimovies #adshoot #ad #advertisement #OPPO #brandambassador #SSRajamouli pic.twitter.com/dK68VwhB4k
— 10Tv News (@10TvTeluguNews) June 13, 2023