టాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ కె రాఘవేంద్ర రావు..ఎంతమంది ఐరెంగ్ లెగ్ అన్న వారికి స్టార్ డం తెచ్చిపెట్టారో ఆయన చేసిన సౌందర్య లహరి కార్యక్రమం చూస్తే తెలుస్తుంది. రమ్యకృష్ణ ని ఇండస్ట్రీకి పనికిరాదని కామెంట్స్ చేసినవారున్నారు. శ్రీదేవితో 16 ఏళ్ళ వయసు సినిమా చేసి పరిచయం చేశారు. ఆ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్స్ శ్రీదేవికి ఇచ్చారు.
అలనాటి సీనియర్ హీరోయిన్స్ దగ్గర్నుంచీ ఇప్పుడు సీనియర్ హీరోలతో కూడా చేస్తున్న శ్రీలీల వరకూ దర్శకేంద్రుడు చూపించని హీరోయిన్ లేదు. విజయశాంతి, రాధ, సుహాసిని..ఇలా ఆ జనరేషన్ హీరోయిన్స్ ఆ తర్వాత సౌందర్య, రమ్యకృష్ణ, మీన, రోజా, రాశి, ఇప్పటి శ్రీలీల ఆఖరికి బులీతెర మీద సందడి చేస్తున్న దీపిక పిల్లి, వర్షిణి, విష్ణుప్రియ వరకూ ఎవరినీ వదల్లేదు.
ఒక్కసారి రాఘవేంద్ర రావు సినిమాలో హీరోయిన్గా బుక్కైతే హీరోయిన్ అందాల దర్శనం కలిగినట్టే. మన సినీ లవర్స్ కి హీరోయిన్ మీద యమా మోజు ఉంటుంది. మీనా, రాశిలకి ఉన్న అందాలు చూస్తే దర్శకేంద్రుకి ఊరుకోబూదేస్తుందా. అందుకే, పూలతో పళ్ళతో కొట్టి పాలను, తేనేను పోసి చూపిస్తారు. హీరోయిన్ ఎలా ఉన్నా దర్శకేంద్రుడు యమా రొమాంటిక్గా చూపించి జనాలను అసలు రసపట్టులోకి తీసుకొస్తారు.
కేవలం రాఘవేంద్రుడు తీసిన సినిమాల్లో ఉన్న హీరోయిన్ సీన్స్ అన్నీ కట్ చేసి ఓ వీడియో ఎడిట్ చేస్తే దాన్ని చూసి క్లైమాక్స్ కి చేరుకునేవారు లక్షల్లో ఉంటారంటే సందేహం లేదు. ఈ గురూజీ ఇలాంటి సీన్స్ తీసేటప్పుడు ఆ హీరోయిన్ మీద స్వయంగా ఆయన అనుకున్న పండునో పువ్వునో వేసి కొడతారట. ఒక సాంగ్లో హీరోయిన్ ను ఇన్నిసార్లు చూపించాలని లెక్కలు రాసుకుంటారట. కాస్త మొహమాటపడ్డ హీరోలతో హీరోయిన్ కి ముద్దు పెట్టించారంటే ఆయనలో ఉన్న ఫీలింగ్స్ ఏ రేంజ్లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఆయన ఒక సీన్ తీస్తే అందులో ఆయనను ఊహించుకుంటారట. అంతగా ఇన్వాల్వ్ అయితేనే హీరో హీరోయిన్స్ మధ్య కావాల్సిన కెమిస్ట్రీ కుదిరి రెచ్చిపోతారని స్వయంగా ఆయన చెప్పిన సందర్భాలున్నాయి. ఆయన సినిమాలో చేస్తే నా మీద ఏదో ఒక పండు విసిరేవారని ఓ సీనియర్ యాంకర్ కూడా ఓపెన్ అయిన సందర్భాలున్నాయి. ఏదేమైనా దర్శకేంద్రుడు కొన్ని లక్షలమందికి హీరోయిన్ కి ఉన్న గొప్పతనాన్ని చెప్పారు.