ప్రాజెక్ట్ కే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా సైంటిఫిక్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కనుంది. కాగా దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్తో వైజయంతీ మూవీస్ అధినేత చలసాని అశ్వనీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మహానటి తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తరకెక్కిస్తున్నాడు.
చనున్నాడు.
ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరో అమితాబచ్చన్, హీరోయిన్ దీపికా పదుకొనే, దిశా పటానితో పాటు కమల్ హాసన్ కూడా కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే కథానాయకుడు కమల్ హాసన్ డిఫరెంట్ రోల్ లో ఈ సినిమాలో కనిపించబోతున్నట్టు సమాచారం. కమల్ది నెగటివ్ రోల్ అంటున్నారు. దీంతో ఈ సినిమాపై మరింత ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది.
ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై పాన్ ఇండియా లెవల్లో ప్రేక్షకుల అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాలో కీరోల్లో నటిస్తున్న నటీనటుల రెమ్యూనరేషన్ వివరాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఎవరి రెమ్యూనరేషన్ ఎంతో చూస్తే హీరో ప్రభాస్కు 150 కోట్ల రెమ్యూనరేషన్, హీరోయిన్ దీపికా పదుకొనే 10 కోట్లు, అమితాబచ్చన్ 15 కోట్లు అందుకుంటున్నారు.
ఇక విలన్గా కనిపించే కమల్ హాసన్ 50 కోట్లు, దిశా పటానీ ఏడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. మామూలుగా ఈ రెమ్యునరేషన్లతో టాలీవుడ్లో మూడు, నాలుగు మిడిల్ రేంజ్, అంతకు మించిన రేంజ్ సినిమాలు కూడా తీసేయొచ్చు. ఇక ఓవరాల్గా ఈ సినిమా బడ్జెట్ రు. 600 కోట్లు పైనే అంటున్నారు.