యంగ్రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల లైనప్ అయితే మామూలుగా లేదు. వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. బాహుబలి సీరిస్ సినిమాల తర్వాత తనకు వచ్చిన పాన్ ఇండియా ఇమేజ్ కంటిన్యూ చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్గా ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ త్వరలోనే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
కేజీయఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలిసిందే. ఇక సంక్రాంతికి ఇప్పటికే ప్రాజెక్ట్ కే షెడ్యూల్ అయ్యి ఉంది. ఈ సినిమా తర్వాత సందీప్రెడ్డి వంగ స్పిరిట్తో పాటు ప్రభాస్ – మారుతి కాంబోలో వచ్చే సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. ఇక ప్రభాస్ -మారుతి సినిమా ఆరంభమే ఓ సంచలనం.
ఈ సినిమా ఉందని అంటున్నా.. ఇప్పటి వరకు అధికారికంగా అనౌన్స్ మెంట్ లేదు. చాలా సైలంట్ గా షూటింగ్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నారన్న గుసగుసలు అయితే ఇండస్ట్రీలో ఉన్నాయి. ఇక ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్ బలంగా మీడియా, సోషల్ మీడియాలో తిరిగేసింది. సినిమా కథలో ఓ థియేటర్ అన్నది కీలకంగా ఉంటుందని.. దాని పేరు మీదే రాజా డీలక్స్ పెట్టారని అన్నారు.
అయితే ఈ టైటిల్ అప్పట్లోనే చాలా మందికి నచ్చలేదు. ఇప్పుడు ఈ టైటిల్ పక్కన పెట్టేశారని.. మరో కొత్త టైటిల్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఆ కొత్త టైటిల్ అంబాసిడర్. సినిమాలో ఓ కారు కూడా కీలకంగా వుంటుందని.. అందుకే సినిమాకు అంబాసిడర్ అనే టైటిల్ దర్శకుడు మారుతి పరిళీలిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారు. కేవలం 65 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.