PS-1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 450 కోట్లు

పాన్ ఇండియా మూవీ ‘పీఎస్-1 ‘ సినిమా చాలా మందిని ఆకట్టుకుంది. మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 450 కోట్లకు పైగా వసూలు చేసిందని మేకర్స్ ఈరోజు వెల్లడించారు. ఇప్పటికీ ఈ చిత్రం తమిళ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది.

తెలుగులో కూడా ఈ సినిమా డీసెంట్ బిజినెస్ చేసింది. మణిరత్నం త్వరలో మిగిలిన భాగాల చిత్రీకరణను ప్రారంభించి 2023 వేసవిలో విడుదల చేయనున్నారు.ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్,విక్రమ్ ,కార్తీ ,జయరాం రవి , శోభిత ధూళిపాళ్ల ,త్రిష , విక్రమ్ ప్రభు ,ఐశ్వర్య లక్ష్మి ,జయరాం ,ప్రకాష్ రాజ్ , నాజర్ తదితరులు నటించారు .

Tags: kollywood director maniratnam, Ponniyin Selvan, ponniyin selvan collections, PS-1 MOVIE