రీసెంట్ టైమ్స్లో విరూపాక్ష మూవీతో భారీ బ్లాక్బస్టర్ సొంతం చేసుకున్న మెగాసుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం సముద్రఖని దర్శకత్వంలో బ్రో సినిమాలో నటిస్తున్నాడు. తన మేనమామ పవన్కళ్యాణ్తో కలిసి నటిస్తోన్న బ్రో మూవీ జూలై 28న వరల్డ్వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తర్వాత సాయిధరమ్ తేజ్ దర్శకుడు జయంత్తో పాటు సంపత్నంది దర్శకత్వంలో మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు.
ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించనున్నారు. ఈ సినిమాకు తీసుకున్న టైటిల్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో ఇంట్రస్టింగ్గా మారింది. ఈ సినిమాకు గాంజా శంకర్ అనే టైటిల్ ని మేకర్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో సాయిధరమ్ మేనమామ పవన్ కళ్యాన్ గుడుంబా శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్ అంచనాలు అందుకోలేదు. పవన్ నుంచి ఈ స్థాయిలో కామెడీ ఎంటర్టైనర్ను ప్రేక్షకులు ఆశించలేదు. అయితే నాడు మేనమామ గుడుంబా శంకర్గా వచ్చి నిరాశ పరిస్తే… ఇన్నేళ్లకు మేనళ్లుడు గాజా శంకర్గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మరి ఈ సారి మేనళ్లుడు ఏం చేస్తాడో ? చూడాలి.
ఇక ఈ సినిమా దర్శకుడు సంపత్నంది విషయానికి వస్తే గోపీచంద్ హీరోగా సీటిమార్ మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఆ సినిమా అంత సక్సెస్ కాలేదు. మరి ఇప్పుడు గాజా శంకర్తో అయినా హిట్ కొట్టి ట్రాక్లోకి వస్తాడేమో ? చూడాలి.