పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కు ఉన్న క్రేజ్ వేరు. వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుంది అంటే చాలు తెలుగు సినిమా మొత్తం షేక్ అయిపోతుంది. మీరు కాంబోలో వచ్చిన జల్సా – అత్తారింటికి దారేది రెండు సూపర్ హిట్ అయ్యాయి. అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్. ముచ్చటగా మూడోసారి ఆజ్ఞాతవాసి సినిమా వీరి కాంబినేషన్లో రాగా డిజాస్టర్ అయింది.
ఇంకా చెప్పాలి అంటే ఈ సినిమాతో ఈ ఇద్దరి పరువు పోయింది. పవన్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చినవి మొత్తం మూడు సినిమాలైనా అంటే కాదు ఏడు సినిమాలు అని చెప్పాలి. ఇటీవల కాలంలో పవన్ నటిస్తున్న అన్ని సినిమాలు మొత్తం త్రివిక్రమ్ కనుసనల్లోనే నడుస్తున్నాయి. పవన్ సినిమాలు వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, ఓజి ఈ నాలుగు సినిమాలు కూడా దర్శకుడు త్రివిక్రమ్ సెట్ చేసినవే.
వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్, భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె.చంద్ర, ఇప్పుడు బ్రో డైరెక్టర్ సముద్రఖనిలను పూర్తిగా డమ్మీలను చేస్తూ ఈ సినిమాలను త్రివిక్రమ్ తానే నడిపించేశాడు. ఈ సినిమాలు హిట్ అయినా పేరు డైరెక్టర్లకు రాలేదు. అసలు వేణు, సాగర్కు తర్వాత సినిమా ఛాన్సులు కూడా ఇప్పటకీ రాలేదు.
ఇక ఇప్పుడు బ్రో సినిమాకు కూడా త్రివిక్రమే మెయిన్ లీడ్. ఈ సినిమాకు త్రివిక్రమ్ కథ మార్పులు, మాటలు అందించారు. ఇందుకోసమే 15 కోట్లు రెమ్యూనిరేషన్, పావలా వాటా తీసుకున్నారని వినిపిస్తూనే వుంది. ఇక సుజిత్ డైరెక్షన్లో వస్తోన్న ఓజి కి కేవలం సైలంట్ వాటాదారు మాత్రమే అన్నది తెరవెనుక వినిపించే టాక్. ఆ ప్రాజెక్టు సెట్ చేసినందుకు గాను త్రివిక్రమ్కు వాటా ఇవ్వక తప్పట్లేదట.
అంతెందుకు పవన్తో సినిమా అంటే త్రివిక్రమ్ ప్రాపకం ఉండాల్సిందే. త్రివిక్రమ్ సాయం లేని క్రిష్ వీరమల్లు, హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్సింగ్ సినిమాల దుస్థితి ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం.