తృటిలో పెద్ద ప్ర‌మాదం త‌ప్పించుకున్న నారా లోకేష్‌.. అస‌లేం జ‌రిగింది..!

టీడీపీ యువ‌నాయ‌కుడు, ఆ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌కు పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. లోకేష్ అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ పాద‌యాత్ర‌లో స్థానిక ఎమ్మెల్యే ప‌య్యావుల కేశ‌వ్ భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈ క్ర‌మంలోనే స్థానిక పార్టీ నేత‌లు లోకేష్‌కు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికేందుకు ఏర్పాట్లు చేశారు.

కూడేరులో క్రేన్‌ నుంచి తెగిన గజమాల లోకేశ్‌పై పడడంతో అంద‌రూ షాక్ అయ్యారు. దీంతో ఒక్కసారిగా వేలాది మంది అభిమానులు లోకేష్ వద్దకు రావడంతో తోపులాట జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే పార్టీ శ్రేణులు క్రేన్‌కు వేలాడదీసిన భారీ గజమాలను లాగడంతో అది లోకేష్ ఉన్న చోట ఒక్కసారిగా తెగిపడిపోయింది. అది మొత్తం లోకేష్ మీద ప‌డితే పెద్ద ప్ర‌మాద‌మే జ‌రిగి ఉండేది.

అయితే తృటిలో ప్రమాదం తప్పడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. దీనిపై టీడీపీ శ్రేణులు భ‌గ్గుమంటున్నాయి. లోకేష్ పాద‌యాత్ర‌లో అస్స‌లు పోలీసుల భ‌ద్ర‌తా వైఫల్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ని.. పోలీసుల నిర్ల‌క్ష్య వైఖ‌రి వ‌ల్లే ఇదంతా జ‌రిగింద‌ని ఆరోపిస్తున్నాయి.