ఎస్ ఇది నిజమే అన్న చర్చ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. మోహన్బాబు ఎక్కడైనా తన మాటే నెగ్గాలని అనుకుంటాడు. ఈ క్రమంలోనే దర్శకధీరుడు రాజమౌళి దగ్గర కూడా తన మాటే నెగ్గాలని ఓ సారం పంతం వేశాడట. అయితే ఆ పంతం నెరవేరలేదు. అక్కడ నుంచి వీరిద్దరి మధ్య కాస్త గ్యాప్ ఉందనే అంటారు. అసలు విషయంలోకి వెళితే రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా మయదొంగ.
2007లో రిలీజ్ అయిన ఈ సినిమాలో ప్రియమణి, మమతా మోహన్దాస్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో యముడిగా విలక్షణ నటుడు మోహన్బాబు నటించారు. ఆ సినిమా టైంలో రాజమౌళి, మోహన్ బాబు మంచి క్లోజ్ అయ్యారు. ఈ క్రమంలోనే మోహన్బాబు రాజమౌళితో తన పెద్ద కొడుకు విష్ణుతో తన బ్యానర్లో ఓ సినిమా చేసి పెట్టమని రిక్వెస్ట్ చేశారట.
అప్పటకి విష్ణుకు సరైన హిట్లు లేవు. రాజమౌళితో ఒక్క సినిమా పడితే తన కొడుకు కెరీర్ లేస్తుందని.. హీరోగా సెటిల్ అవుతాడన్నదే మోహన్బాబు ఆశ. అయితే అందుకు రాజమౌళి ఒప్పుకోలేదట. తాను ఇప్పటికిప్పుడు విష్ణుతో సినిమా చేయలేనని.. టైం వచ్చినప్పుడు చేస్తానని చెప్పారట. అయితే మోహన్బాబు మాత్రం ఇప్పుడే విష్ణుతో సినిమా చేయాలని.. తన కొడుకు ప్లాపుల్లో ఉన్నాడని బలవంతం చేశాడట.
అయితే రాజమౌళి మాత్రం కుదరదని ఖరాఖండీగా చెప్పేశాడట. మీరు బలవంత పెడితే సినిమా తీసేస్తాను…రిజల్ట్ నా చేతుల్లో లేదని చెప్పడంతో మోహన్బాబు బాగా హర్ట్ అయ్యారట. నా మాట ఇండస్ట్రీలో ఎవ్వరూ కాదనరు. నేను ఒక్క సినిమా చేసి పెట్టమని అడిగితే రాజమౌళి ఇలా అంటాడా ? అని ఇండస్ట్రీలో తన సన్నిహితలతో చెప్పుకుని మోహన్బాబు వాపోయాడని అంటారు. ఆ తర్వాత వీరి మధ్య అంత సఖ్యత లేదని కూడా ఇండస్ట్రీ టాక్ ?