టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మాటల మంత్రి కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అటు మహేష్ బాబు ఇటు త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే హోరెత్తిపోవాలి. సినిమా సెట్స్ మీదకు వెళ్ళిందో లేదో భయంకరమైన హైప్ క్రియేట్ అవ్వాలి.. కానీ గుంటూరు కారం సినిమాకు ఆది నుంచి అవంతరాలు ఎదురవుతున్నాయి.
ఈ సినిమా టైటిల్ కూడా మహేష్ అభిమానులకే నచ్చలేదు. ముందుగా అనుకున్న హీరోయిన్ పూజ హెగ్డేను మార్చేశారు. ముందుగా అనుకున్న కథ కూడా మార్చేశారు. అసలు థమన్ను మ్యూజిక్ డైరెక్టర్గా ఎంపిక చేసే విషయంలో మహేష్ – త్రివిక్రమ్ కు మధ్య మాట తేడా వచ్చింది. మహేష్ థమన్ కంటే అనిరుధ్ వైపు మొగ్గు చూపాడు. ఇక సినిమాటోగ్రాఫర్ తో పాటు ఈ సినిమాకు పని చేసే ఒకరిద్దరు టెక్నీషియన్లు కూడా మారిపోయినట్టు తెలుస్తోంది.
దీనికి తోడు ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్లో షూటింగ్ చేసిన కొంత ఫుటేజ్ కూడా రీ షూట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకో గాని సినిమాపై మహేష్ అభిమానులకే నమ్మకాలు కలగటం లేదు. ఈ ఒక్క సినిమా విషయంలో మాత్రమే కాదు.. గతంలో మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజాల విషయంలోనూ ఎన్నో కాంట్రవర్సీలు వచ్చాయి.
అతడు సినిమా విషయంలో నిర్మాత మురళీమోహన్కు త్రివిక్రమ్ కు మధ్య పొసగ లేదు. త్రివిక్రమ్ తాము అనుకున్న దానికంటే ఎక్కువ బడ్జెట్ పెట్టించాడని.. ఎక్కువ డేట్లు షూటింగ్ చేయడంతో ఆర్థికంగా తమ నష్టపోవాల్సి వచ్చిందని మురళీమోహన్ ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించారు. ఇక ఖలీజా సినిమా ఫైనాన్స్ విషయంలో ఇదంతా మాఫియా కంట్రోల్లో తెరకెక్కిన సినిమా అన్న ప్రచారం జరిగింది.
ఈ సినిమా టైంలో నిర్మాత శింగనమల రమేష్ బాబు కేసులు, ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. సినిమా కూడా డిజాస్టర్ అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్నా గుంటూరు కారం సినిమా కూడా అంతే వివాదాల్లో కూరుకుపోయింది. ఏది ఏమైనా మహేష్ అభిమానులు కూడా త్రివిక్రమ్ – మహేష్ కాంబినేషన్ ఇక వద్దబ్బా నీకు దండం త్రివిక్రమ్ అని చెప్పేస్తున్న పరిస్థితి.