ప‌వ‌న్ ‘ బ్రో ‘ సినిమాకు మ‌హేష్ ఫ్యాన్స్ ఫుల్ స‌పోర్ట్‌… రీజ‌న్ ఇదే…!

పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘బ్రో’. ఈ శుక్రవారం బ్రో సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. కోలీవుడ్ న‌టుడు, ద‌ర్శ‌కుడు సముద్రఖని దర్శక‌త్వం వహించిన ఈ సినిమాకు మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. రీసెంట్‌గా హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక వైభ‌వంగా జరిగింది.

ఈ కార్యక్రమంలో పవన్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ సినీ ఇండ‌స్ట్రీలో తాను ప్ర‌తి స్టార్ హీరోతో స్నేహంగా ఉంటానని, వారి సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటానని… దర్శకుడు రాజమౌళి తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లారంటై ప్ర‌శంస‌లు కురిపించారు. ఇక మ‌హేష్‌బాబుతో రాజ‌మౌళి చేయబోయే సినిమానూ కూడా ప‌వ‌న్‌ ప్రస్తావించారు.

మహేశ్ – రాజమౌళి కాంబినేష‌న్లో తెర‌కెక్కే సినిమా ఇంకా పెద్ద స్థాయికి వెళ్లాలని తాను కోరుకుంటున్నానని… దీనిని కొత్తగా వచ్చేవాళ్ళు కొనసాగించాలన్నారు. తనకు అందరు హీరోలు ఇష్టమన్న ప‌వ‌న్‌ వారివల్ల ఎందరికో కడుపు నిండుతుందని చెప్పుకొచ్చారు. మహేశ్ గురించి పవన్ ప్రస్తావించడంతో మ‌హేష్ అభిమానులు అయితే ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ప‌వ‌న్ బ్రో సినిమా హిట్ అవ్వాల‌ని సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మహేశ్ ప్రస్తుతం మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమా ముగిసిన తర్వాత రాజమౌళి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.