టాలీవుడ్ లో ఒకప్పటి స్టార్ హీరోయిన్లలో మంచి క్రేజ్ తో దూసుకువెళ్ళిన వారిలో రంభ ఒకరు. ఆమె తెలుగు, తమిళ, హిందీ, భోజ్పురి ఇలా అన్ని భాషల్లోనూ నటించారు. 1990లో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రంభ దాదాపు అప్పటి స్టార్ హీరోస్ సినిమాల్లోనూ నటించారు. రంభ నటించిన సినిమాలు చాలా వరకు హిట్ కొట్టాయి. విజయవాడకు చెందిన రంభ అసలు పేరు విజయలక్ష్మి. అయితే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆమె అందం, అభినయాన్ని బట్టి ఆమెకు రంభ అనే పేరు వచ్చింది.
రంభకు తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని భాషల సినిమాల్లో మంచి క్రేజ్ ఉంది. భోజపురిలో అయితే ఆమెను ఆరాధ్య దేవతగా కొలిచేవారు. అంతటి అందం, అభినయం ఉన్న రంభను అప్పట్లో ఇద్దరు హీరోలు ప్రేమించారన్న విషయం చాలామందికి తెలియదు, బొంబాయి ప్రియుడు సినిమా తీసే టైంలో జే.డి.చక్రవర్తి రంభతో ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారట. చాలా సందర్భాల్లో రంభ, జే.డి. చక్రవర్తి ఆటపట్టించడంతో ఏడ్చేసారట.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఈ కీచులాటలు జరిగిన సందర్భంలోనే చక్రవర్తి, రంభతో ప్రేమలో పడిపోయారట. ఆ సినిమా టైంలో రంభతో ప్రేమలో పడిన జేడి చక్రవర్తి తన కెరీర్ నిర్లక్ష్యం చేయడంతో తర్వాత హీరోగా ఎదగలేకపోయారు అన్న వార్తలు వినిపించేవి. ఇక రంభ భోజపురి సినిమాల్లో నటించే టైంలో అప్పట్లో స్టార్ హీరోగా ఉన్న బీహార్ కు చెందిన మనోజ్ తివారి ( ఇప్పుడు ఢిల్లీ బీజేపీ ఎంపీ) కూడా రంభ ప్రేమలో పడితన సినీ కేరీర్ ఆశ్రద్ధ చేశాడంటు వార్తలు వినిపించాయి.
తర్వాత రంభ కెనడాకు చెందిన పెద్ద పారిశ్రామికవేత్త అయిన ఇంద్ర కుమార్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉండడంతో ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పడింది. రంభ అప్పటి నుంచి తన ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం రంభ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ కి ఛాన్సుల కోసం ప్రయత్నిస్తుంది.