వైసీపీ మాజీమంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నిద్ర లేస్తే చాలు టిడిపి, చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ మీద నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తూ ఉంటారు. పైగా కొడాలి నాని రాజకీయపరమైన విమర్శలు చేయకుండా పచ్చి బూతులతోనే మాట్లాడుతూ ఉంటారు. వైసిపి నేతలు కూడా కొడాలి నానిని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. దీంతో నానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇప్పటివరకు చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చిన నాని ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబాన్ని కూడా టార్గెట్గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు వెనకాల తిరుగుతూ సిగ్గు, శరం లేకుండా వ్యవహరిస్తున్నారు అంటూ నాని ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై విమర్శలు చేస్తున్నారు. ఎన్టీఆర్ లా పౌరుషం ఉన్న నాయకుడు ఒక్క హరికృష్ణ మాత్రమే అన్న కొడాలి నాని.. మిగిలిన ఎన్టీఆర్ కుటుంబాన్ని విమర్శిస్తున్నారు. అయితే టీడీపీ నేతలు, నందమూరి కుటుంబ అభిమానులు మాత్రం కొడాలి నానికి గట్టి కౌంటర్లు ఇస్తున్నారు.
నీకోసం గుడివాడలో పార్టీకి ఎంతో నమ్మకంగా ఉండే రావి కుటుంబాన్ని పక్కనపెట్టి మరి చంద్రబాబు రెండుసార్లు టిక్కెట్ ఇచ్చారని.. కానీ తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబుకు, టిడిపికి వెన్నుపోటు పొడిచి వైసిపిలోకి వెళ్లలేదా ? అని నందమూరి అభిమానులు నానికి ప్రశ్నలు సంధిస్తున్నారు. చంద్రబాబు పాలనలో పోలవరం ఎందుకు ? పూర్తి చేయలేదని నాని పదే పదే ప్రశ్నించే వారని.. మరి జగన్ నాలుగేళ్ల కాలంలో పోలవరంలో జరిగిన పనులు ఎంత ? అనేదానిపై నానికి పూర్తి వివరాలతో ఒక నివేదిక విడుదల చేసే దమ్ముందా ? అన్న ప్రశ్నలు కూడా నానికి వ్యక్తం అవుతున్నాయి.
వచ్చే ఎన్నిక లకు ముందు పోలవరం పూర్తవుతుందా ? అన్న ప్రశ్నకు నాని ఏమని ? సమాధానం ఇస్తారు అని కూడా సోషల్ మీడియాలో టిడిపి, నందమూరి అభిమానులు ప్రశ్నలు వేస్తున్నారు. ఏదో విధంగా చంద్రబాబుని నోటికి వచ్చినట్టు బూతులు తిడుతూ ఎంజాయ్ చేయటం.. అటు వైసీపీ అధిష్టానాన్ని బుట్టలో వేసుకోవటం అన్నట్టుగా మాత్రమే నాని తీరు ఉందే తప్ప వాస్తవాలు మాట్లాడే దమ్ము లేదని టిడిపి వాళ్ళే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరి నానికి నిజంగా ఈ ప్రశ్నలకు ఆన్సర్ చేసే సత్తా ఉంటే స్పందించాలని వారు కోరుతున్నారు.