నందమూరి వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్. ఇటు జూనియర్ ఎన్టీఆర్ కు సోదరుడు కావడం కూడా చాలా ప్లస్ అయింది. అతనొక్కడే సినిమాతో కెరీర్లో తొలి విజయం సాధించిన కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత 118 తో పాటు బింబిసార సినిమాలకు కూడా కళ్యాణ్ రామ్ను హీరోగా నిలబెట్టాయి.
ఈ యేడాది అమీగోస్ సినిమాలో ఏకంగా మూడు పాత్రలతో మెప్పించిన కళ్యాణ్ రామ్ చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. బింబిసార సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇక కళ్యాణ్ రామ్ ఫ్యామిలీ గురించి చాలామందికి తెలియదు. ఫ్యామిలీ విషయాలు కూడా కళ్యాణ్ బయటపెట్టేందుకు పెద్దగా ఇష్టపడడు. కళ్యాణ్ రామ్ భార్య పేరు స్వాతి. ఆమె వృత్తి రీత్యా డాక్టర్. వీరిది పెద్దలు కుదిరిచిన సంబంధం.
పెళ్లి చూపుల్లోనే స్వాతిని చూసిన కళ్యాణ్ ఆమెనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడట. అలా 2006 ఆగస్టు 10న కళ్యాణ్ రామ్ స్వాతి వివాహం జరిగింది. ఈ దంపతులకు అధైత – శౌర్యరామ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక స్వాతి సొంతంగా వి ఎఫ్ ఎక్స్ కంపెనీ నడుపుతున్నారు. కళ్యాణ్ రామ్ సినిమాలతో పాటు పలు టాలీవుడ్ సినిమాలకు విఎఫ్ఎక్స్ పనులు అన్ని ఈ కంపెనీ నిర్వహిస్తూ ఉంటుంది.
అలాగే కళ్యాణ్రామ్ బింబిసార సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఈ సంస్థలోనే జరిగాయి. ఇక స్వాతి కాలేజ్ రోజుల్లో మహా చిలిపి పనులు చేసేవారట. ఆమె స్వతహాగా టాలీవుడ్ కింగ్ నాగార్జునకు వీరాభిమాని. ముఖ్యంగా ఆమె కాలేజీ రోజుల్లో నాగార్జున సినిమాలు రిలీజ్ అయితే చాలు.. ఫస్ట్ డే కాలేజ్ కు డొమ్మా కొట్టి మరి ఆ సినిమాలు చూసేవారట.
నాగార్జున నటించిన బ్లాక్ బస్టర్ సినిమా మన్మధుడును కూడా ఫస్ట్ డే కాలేజ్కు బంక్ కొట్టి మరి ఆమె థియేటర్లో చూసిందట. ఈ విషయం కళ్యాణ్ రామ్ మీలో ఎవరు ? కోటీశ్వరుడు ప్రోగ్రాం లో స్వయంగా చెప్పాడు. దీంతో నెటిజన్లు కళ్యాణ్ రామ్ భార్య స్వాతి మొత్తానికి మహా చెలిపి అమ్మాయే అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.