ఆ రెండు సీట్ల‌లో వైసీపీ గెలిస్తే ఒట్టు.. జ‌గ‌న్‌కు ఇంతవరకు ఛాన్స్ లేదే..!

వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్న వైసీపీ..కనీసం మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లు గెలుచుకుని అధికారంలోకి రావడం కూడా కష్టమని తెలుస్తోంది. టి‌డి‌పి రేసులోకి వచ్చిన నేపథ్యంలో వైసీపీకి షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు జనసేనతో టి‌డి‌పి కలిస్తే ఇంకా వైసీపీ పని అంతే. ఇలాంటి పరిస్తితుల్లో కూడా 175 సీట్లు అని టార్గెట్ పెట్టుకుంది.

This TDP MLA Mastered Three Secrets Of Success!

అయితే అలా 175 సీట్లు టార్గెట్ పెట్టుకున్న వైసీపీ కొన్ని స్థానాల్లో గెలిస్తే చాలు అని టి‌డి‌పి శ్రేణులు సవాల్ విసురుతున్నాయి. అలా సవాల్ విసురుతున్న స్థానాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు, ఉండి స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో వైసీపీ గెలిస్తే చాలు అని అంటున్నారు. అసలు ఈ రెండు చోట్ల వైసీపీ ఇంతవరకు గెలవలేదు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోతుంది. వరుసగా టి‌డి‌పి గెలుస్తూ వస్తుంది.

ఈ సారి ఎన్నికల్లో కూడా ఇక్కడ టి‌డి‌పి గెలవడం ఖాయమని ఇటీవల సర్వేల్లో తేల్చేసాయి. సర్వేలు తేల్చే సంగతి పక్కన పెడితే..అసలు ఆ స్థానాల్లో వైసీపీకి ఏ మాత్రం ఛాన్స్ లేదని ప్రజలకే అర్ధమవుతుంది. పాలకొల్లులో టి‌డి‌పి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చాలా బలంగా ఉన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఈయన ఎప్పుడు ప్రజల మనిషే..ప్రజల్లోనే ఉంటారు..ప్రజల కోసం పనిచేస్తారు.

Mantena Ramaraju | MLA | TDP | Undi | West Godavari | Andhra Pradesh

అందుకే పాలకొల్లు ప్రజలు నిమ్మలని ఆదరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆదరించడం ఖాయమని తేలిపోయింది. ఇటు ఉండి అంటే టి‌డి‌పి కంచుకోట. టి‌డి‌పి ఆవిర్భావం తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే ఇక్కడ ఓడిపోయింది..ఇంకా అన్నీ విజయాలే. ఇక్కడ ఎవరు బరిలో ఉన్నా టి‌డి‌పి గెలుపు ఖాయమని చెప్పవచ్చు. అక్కడ ప్రజలంతా టి‌డి‌పికే మద్ధతుగా ఉంటారు. కాబట్టి ఈ రెండు చోట్ల వైసీపీ గెలవడం గగనమని చెప్పవచ్చు.

Tags: AP, ap politics, intresting news, latest news, latest viral news, social media, social media post, telugu news, trendy news, viral news, YS Jagan, ysrcp