ప్రముఖ నిర్మాతగా పేరు తెచ్చుకున్న దగ్గుబాటి రామానాయుడు గురించి.. అందరికి తెలిసినా.. ఆయన జీవితంలో తెలియని విషయాలు కూడా ఉన్నాయి. తెలుగు సినీ రంగంలో నిర్మాతగా ఆయన అనేక సి నిమాలు చేశారు. అంతేకాదు.. కొన్ని కొన్ని సినిమాల్లో అతిథి పాత్రలోనూ నటించారు. రామానాయుడు సినీ జీవితాన్ని పరిశీలిస్తే.. ఆయనకు తొలినాళ్లలో చాలా వైఫల్యాలు ఎదురయ్యాయి. తీసిన సినిమా తీసినట్టు ఫెయిల్ అయింది.
దీంతో ప్రకాశం జిల్లా కారంచేడులోని తన వాటా ఆస్తికింద వచ్చిన పొలాలు, ఇళ్లను కూడా ఆయన అమ్మే సుకున్నారు. అదేసమయంలో ఆయనకు ఉన్న గుర్రపు పందేలు ఆడే వ్యసనంతోనూ కొంత పోగొట్టుకు న్నారు. ఇదిలావుంటే.. అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు.. నాగార్జున, దగ్గుబాటి కుమార్తెలు లవ్ మ్యారే జ్ చేసుకున్నారు. ఇదొక వివాదంగా కొన్ని రోజులు సాగింది. అయితే.. ఎట్టకేలకు అక్కినేని ఒప్పుకొన్నారు.
ఈ క్రమంలోనే తీవ్ర కష్టాల్లో ఉన్న దగ్గుబాటికి అక్కినేని చేయి అందించాలని నిర్ణయించుకుని.. మీరు ఏదైనా కథ చూసుకోండి.. నేను నటిస్తాను.. అని చెప్పారు. కానీ, చేతిలో చిల్లిగవ్వలేదు.. ఉన్నది రెండు లక్షల రూపాయలు.. ఎలా? అని అంతర్మథనం చెందుతూనే.. ఆ రెండు లక్షలను కూడా గుర్రపు పందేలు ఆడేశారు. ఇంకే ముంది.. ఆ రోజే లక్కు కలిసి వచ్చింది.. అక్కడి నుంచి వరుసగా నాలుగు రోజులు గుర్రపు పందేలు కట్టి 50 లక్షలు పోగు చేశారు.
ఆ సొమ్మును జాగ్రత్తగా ఖర్చు పెట్టి మనుటయా.. మరణించుటయా.. అన్న విధంగా.. ప్రేమనగర్ సినిమా కు ప్రాణం పోశారు. ఈ సినిమాలో ఎవరూ రామానాయుడును ఇబ్బంది పెట్టలేదు కానీ.. ఒక్క రచయిత.. ఆత్రేయ మాత్రం ముప్పుతిప్పలు పెట్టేశారట. పాటలు మొత్తం ఆయనే రాశాడు. మొత్తానికి సినిమా రిలీజ్ అయింది. తొలి షో నుంచి 365 రోజుల పాటు కిటకిటలాడిపోయాయి… హాళ్లన్నీ.. ఆ దెబ్బతో రామానాయుడు పుంజుకున్నారు. లేకపోతే.. వ్యవసాయం చేసుకునే వారట.