ఏపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రతిపక్ష టిడిపి అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచి రెడీ అవుతున్నారు. వరుసగా నియోజకవర్గాల సమీక్షలు నిర్వహిస్తూ అభ్యర్థులను ఖరారు చేస్తూ వస్తున్నారు. ఏపీలో ఉన్న 175 నియోజకవర్గాలలో ఇప్పటికే వందకు పైగా నియోజకవర్గాలలో సమీక్షలు పూర్తవడంతోపాటు.. అభ్యర్థుల ప్రకటన కూడా పూర్తయింది.
ఇదిలా ఉంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇప్పటికే తెలుగుదేశం ఐదు నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించింది. ఈ ఐదు నియోజకవర్గాలలో టిడిపి అభ్యర్థులు గెలుపు బాటలో ఉండటం మరో విశేషం. ఇదే ఊపు కంటిన్యూ అయితే 2024 అసెంబ్లీ ఎన్నికలలో టిడిపి జిల్లాలో కనిష్టంగా 8 సీట్లు.. గరిష్టంగా పదికి పది సీట్లు విజయం సాధించే అవకాశాల్లో ఉన్నట్టు రాజకీయ వర్గాలు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే టిడిపి టికెట్లు ఖరారైన వారిలో ఇచ్చాపురం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బెందాళం అశోక్ – టెక్కలిలో అచ్చెం న్నాయుడు – పలాసలో గౌతు శిరీష – ఆముదాలవలస కూన రవికుమార్ – రాజాంలో కోండ్రు మురళీమోహన్ ఉన్నారు. వచ్చే ఎన్నికలలో ఈ ఐదుగురు తిరిగి పోటీ చేస్తారని.. చంద్రబాబు క్లారిటీ ఇచ్చేశారు. రాజాం సీటును పార్టీ సీనియర్ నేత ప్రతిభ భారతి కుమార్తె గ్రీష్మ ఆశించినా ఆమెకు దక్కకపోవచ్చు.
ఇక పాతపట్నం, నరసన్నపేట, శ్రీకాకుళం, ఎచ్చెర్ల, పాలకొండ నియోజకవర్గాల్లో మాత్రమే టిడిపి అభ్యర్థులు ఖరారు కావాల్సి ఉంది. పాతపట్నం నుంచి మాజీ ఎమ్మెల్యే మోహనరావుకు దాదాపు సీటు దక్కే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎచ్చెర్లలో కళా వెంకట్రావు లేదా కలిశెట్టి అప్పలనాయుడులో ఎవరో ఒకరికి సీటు ఫిక్స్ అవుతుందని తెలుస్తోంది. ఆముదాలవసలో కూన రవికుమార్ స్ట్రాంగ్ క్యాండెట్. ఇక పాలకొండ, నరసన్నపేట, శ్రీకాకుళం లాంటి చోట్ల చివరి వరకు అభ్యర్థులు ఎవరు అన్నది తేలికపోవచ్చు.