ఛలో సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రష్మిక మందన్నా. తన తొలి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత వరుస స్టార్ హీరోలతో నటించే స్టార్ హీరోయిన్ గా మారింది. ఇక అదే సమయంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ను దక్కించుకుంది రష్మిక మందన్నా. ప్రస్తుతం టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని ఇండస్ట్రీలో వరుస సినిమాలు కమిట్ అవుతూ చిత్ర పరిశ్రమను షేక్ చేస్తుంది.
ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉండే రష్మిక మందన్నా.. అందరి హీరోయిన్ల మాదిరిగా సమయం దొరికితే రెస్ట్ తీసుకోవాలని అసలు అనుకోదట. ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా కిచెన్ లోకి దూరి వంట చేస్తుందట. ఎలాంటి వంటనైనా సరే తనదైన స్టైల్ లో మార్చేసి దాన్ని డిఫరెంట్ గా చేయడం రష్మికకు ఎంతో ఇష్టమట.
అంతే కాకుండా తన చేతితో ప్రిపేర్ చేసిన ఫుడ్ని నలుగురికి పంచిపెట్టడం అంటే ఇంకా ఇష్టమట. అందుకే రష్మికకు ఏమాత్రం సమయం దొరికిన షూటింగ్ సమయంలో గ్యాప్ ఉన్నా సరే వంట చేసి నలుగురికి వడ్డిస్తుందట. ఇదీ తనకు చిన్నప్పటి నుంచి ఈ అలవాటు వచ్చిందట..రష్మిక మందన్నా చిన్నప్పటి నుంచి ఎన్నో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చి సెటిలైంది.
అందుకే ఆహారం పెట్టడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుందట. అంతేకాకుండా ఎప్పుడైనా తనకు మనసు బాగో లేకపోయినా వెంటనే కిచెన్ లోకి వెళ్లి వంట చేస్తే ఆ మూడ్ లో నుంచి బయటికి వస్తుందట. ఇక ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రష్మిక ఫ్యాన్స్ సైతం ఫిదా అవుతున్నారు. ఇక ప్రస్తుతం రష్మిక చేతిలో టాలీవుడ్తో పాటు పలు బాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి.