క్రిష్ త‌న భార్య‌కు విడాకులు ఇవ్వ‌డానికి హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్‌కు లింక్ ఉందా..!

టాలీవుడ్‌లో వైవిధ్య‌మైన సినిమాలు తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు క్రిష్ శైలే వేరు. వేదం, గ‌మ్యం, శాత‌క‌ర్ణి, ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు, మ‌హానాయ‌కుడు, కొండ‌పొలం ఇలా క్రిష్ కెరీర్‌లో అన్ని వైవిధ్య‌మైన సినిమాలే ఉంటాయి. రానాతో తీసిన క్రిష్టం వందే జ‌గ‌ద్గురుం కూడా అలానే ఉంటుంది. చాలా లేటు వ‌య‌స్సులో డైరెక్ట‌ర్ అయిన క్రిష్ పెళ్లి జీవితంపై పెద్ద‌గా ఫోక‌స్ చేయ‌లేదు.

బాల‌య్య‌తో క్రిష్ తీసిన గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి సినిమా తెర‌కెక్కిస్తోన్న టైంలో హైద‌రాబాద్‌లోని ఓ ప్ర‌ముఖ హాస్ప‌ట‌ల్లో ప‌నిచేసే డాక్ట‌ర్ ర‌మ్య‌ను క్రిష్ పెళ్లి చేసుకున్నాడు. ఇది పెద్ద‌లు కుదిర్చిన వివాహం. అయితే పెళ్లి జ‌రిగిన కొద్ది రోజుల‌కే భార్య భ‌ర్త‌ల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో వీరు విడిపోయారు. దీనికి కార‌ణం హీరోయిన్ ప్ర‌గ్య జైశ్వాల్ అని రూమ‌ర్లు వినిపించాయి.

క్రిష్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన కంచె సినిమాలో ప్ర‌గ్య హీరోయిన్. అయితే క్రిష్ బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ ప్ర‌ధాన‌పాత్ర‌లో ఆమె నిర్ణాత్మ‌గా మ‌ణిక‌ర్ణిక సినిమాను డైరెక్ట్ చేశారు. క్రిష్ పెళ్లి అయిన వెంట‌నే భార్య‌కు దూరంగా ముంబైలో మ‌కాం వేసి మ‌రి మ‌ణిక‌ర్ణిక సినిమాను డైరెక్ట్ చేశాడు క్రిష్‌. ఆ టైంలో ర‌మ్య‌కు ఎందుకో ? త‌న భ‌ర్త మీద అనుమానం వ‌చ్చింద‌ని… ఓ రోజు డైరెక్టుగా ముంబైలో క్రిష్ ఉన్న ప్లాట్‌కు వెళ్లింద‌ట‌.

అప్పుడు క్రిష్ ప్లాట్‌లో ప్ర‌గ్య‌తో ఉండ‌డం రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టేసింద‌ని.. ఆ వెంట‌నే ఆమె క్రిష్‌కు విడాకులు ఇచ్చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. వీరిద్ద‌రు ప‌ర‌స్ప‌ర అంగీకారంతో 2018లోనే విడాకులు తీసుకున్నారు. ఈ కార‌ణంతోనే మ‌ణిక‌ర్ణిక సినిమాను డైరెక్ట్ చేసే విష‌యంలో క్రిష్ అంత ఏకాగ్ర‌త‌తో ఉండ‌లేద‌ని.. ఈ క్ర‌మంలోనే అటు కంగ‌న‌కు, క్రిష్‌కు మ‌ధ్య క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వ‌చ్చాయ‌ని అంటారు.