కుప్పంలో ఈ సారి బాబు మెజార్టీ ఎంతో తెలుసా… వైసీపీకి చుక్క‌లు కూడా క‌న‌ప‌డ‌వ్‌..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం(ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా) నియోజ‌క వ‌ర్గంలో మ‌రోసారి ఆయ‌నే గెలుపొంద‌డం త‌థ్య‌మ‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. క్షేత్ర‌స్థాయిలో చేసిన ప‌లు స‌ర్వేల్లోనూ ఇక్క‌డి ప్ర‌జలు చంద్ర‌బాబువైపే మొగ్గు చూపించార‌ని అంటున్నారు.అంతేకాదు… చంద్ర‌బాబు సుమారు.. 70 వేల నుంచి ల‌క్ష మెజారిటీ ద‌క్కించుకున్నా.. ఆశ్చ‌ర్యం లేద‌ని ప‌క్కాగా లెక్క‌లు వేస్తున్నారు. ఈ మొత్తం ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. చంద్ర‌బాబు విజ‌యం ప‌క్కా.. మెజారిటీనే లెక్క‌.. అంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు.

ఎందుకింత హాట్ అయింది..?
నిజానికి భూమి గుండ్రంగా ఉంద‌న్న‌ట్టుగానే.. కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఏడు ఎన్నిక‌లుగా అంటే.. సుమారు 35 సంవ‌త్స‌రాలుగా.. చంద్ర‌బాబు పోటీ చేస్తున్నారు. కొన్ని ఎన్నిక‌లకు ప్ర‌చారం నిమిత్తం వెళ్లినా.. దాదాపు నాలుగైదు ఎన్నిక‌ల నుంచి ఆయ‌న అస‌లు అక్క‌డ ప్ర‌చారం కూడా చేయ‌కుండానే గెలుపు గుర్రం ఎక్కుతున్నారు. అలాంటి నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు ఎందుకు ఇంత హాట్ టాపిక్ అయింద‌నేది ఆస‌క్తిగా ఉంది. దీనికి ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు ఉన్నాయి.

ఒక‌టి.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ వైనాట్ 175 నినాదం అందుకోవ‌డంతో పాటు.. టీడీపీ అధినేత చంద్రబా బును ఓడిస్తే.. ఇంకా త‌మ ఇమేజ్ పెరుగుతుంద‌ని రాజ‌కీయంగా వేసుకున్న అంచ‌నాల‌తో కుప్పం నియోజ క‌వ‌ర్గం చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చింది. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబును ఓడించాల‌నే ఏకైక ల‌క్ష్యంగా ఇక్క‌డ మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీ.. వంటి అనేక మంది ప్ర‌య‌త్నాలు చేయ‌డం.. గ‌త ఏడాది జ‌రిగిన కుప్ప మునిసిపాలిటీని వైసీపీ ద‌క్కించుకోవ‌డంతో ఇక్క‌డి ప‌రిణామాల‌పై మ‌రింత చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది.

స‌ర్వేలు ఏం చెబుతున్నాయి…?
ఇక‌, కుప్పంపై క‌న్నేసిన వైసీపీ నాయ‌కులు.. అభివృద్ధి మంత్రం జ‌పించారు. అదేస‌మ‌యంలో పేరుపేరు నా ప‌థ‌కాలు కూడా అందించారు. అయితే.. స్థానిక నేత‌ల్లో మొద‌లైన కుమ్ములాట‌లు స‌హా.. ప్ర‌జ‌ల్లోనూ.. వైసీపీపై స‌డులుతున్న న‌మ్మ‌కం.. వంటివి వైసీపీ వేస్తున్న ఎత్తుగ‌డ‌లు ఓటివేన‌ని తేలిపోయింది. దీంతో ఇక్క‌డ‌.. వైసీపీ పాగా వేయ‌డం క‌ష్ట‌మేన‌ని.. ప్ర‌స్తుతం ఉన్న బ‌లం కేవ‌లం నేతిబీర‌లో నెయ్యిచంద‌మేన ని.. ప‌లు స‌ర్వేలు చాటుతున్నాయి. అంతేకాదు.. వైసీపీని గెలిపిస్తే.. స్థానికంగా శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య వ‌చ్చినా.. రావొచ్చ‌నే చ‌ర్చ ప్ర‌జ‌ల్లోనూ ఉండ‌డం గ‌మ‌నార్హం.

చంద్ర‌బాబే మ‌ళ్లీ ప‌ట్టం.. వెనుక‌
ఇక‌, ప్ర‌స్తుత కుప్పం ఎమ్మెల్యే, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకే మ‌ళ్లీ ఇక్క‌డి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టేందుకు రెడీ కావ‌డం వెనుక 2 ప్ర‌ధాన రీజ‌న్లు క‌నిపిస్తున్నాయ‌ని స‌ర్వే చేసిన వారితోపాటు.. టీడీపీ నాయ‌కులు కూడా చెబుతున్నారు. ఒక‌టి.. విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా గుర్తింపు పొందిన చంద్ర‌బాబును ఓడించ‌డం అనే మాట‌ను కుప్పం ప్ర‌జ‌లు జీర్ణించుకోలేక పోవ‌డం.. అస‌లు ఆ మాట అనేందుకు.. వినేందుకు కూడా సాహ‌సించ‌లేక పోవ‌డం. రెండు.. చంద్ర‌బాబు త‌న పొలిటిక‌ల్ లైఫ్‌లో ఇదే చివ‌రి ఎన్నిక‌లు అని ప్ర‌క‌ట‌న చేయ‌డం.

వీట‌న్నింటికీ తోడు.. ప్ర‌జ‌లు కోరుకుంటున్న కీల‌క‌మైన శాంతి భ‌ద్ర‌లు. చంద్ర‌బాబు ఎమ్మెల్యేగా ఉన్నంత వ‌ర‌కు శాంతి భ‌ద్ర‌త‌ల‌కు లోటు లేద‌ని మెజారిటీ ప్ర‌జ‌లు భావిస్తున్న‌ట్టు తాజాగా చేసిన ప‌లు స‌ర్వేలు తేల్చి చెప్ప‌డం.. గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో వైసీపీ ఎంత పెనుగులాడినా.. ప్ర‌యోజ‌నం లేద‌ని.. స‌ర్వేలు తేల్చి చెప్పాయి. అంతేకాదు… చంద్ర‌బాబు విజ‌యం ఖాయ‌మ‌ని 70 వేల మెజార్టీ ప‌క్కా అని… వైసీపీకి చుక్క‌లు క‌న‌ప‌డ‌డం ఖాయ‌మ‌ని అన్ని విశ్లేష‌ణలు చెపుతున్నాయ్‌..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం(ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా) నియోజ‌క వ‌ర్గంలో మ‌రోసారి ఆయ‌నే గెలుపొంద‌డం త‌థ్య‌మ‌ని చెబుతున్నారు ప‌రిశీల‌కులు. క్షేత్ర‌స్థాయిలో చేసిన ప‌లు స‌ర్వేల్లోనూ ఇక్క‌డి ప్ర‌జలు చంద్ర‌బాబువైపే మొగ్గు చూపించార‌ని అంటున్నారు.అంతేకాదు… చంద్ర‌బాబు సుమారు.. 70 వేల నుంచి ల‌క్ష మెజారిటీ ద‌క్కించుకున్నా.. ఆశ్చ‌ర్యం లేద‌ని ప‌క్కాగా లెక్క‌లు వేస్తున్నారు. ఈ మొత్తం ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. చంద్ర‌బాబు విజ‌యం ప‌క్కా.. మెజారిటీనే లెక్క‌.. అంటున్నారు తెలుగు త‌మ్ముళ్లు.

ఎందుకింత హాట్ అయింది..?
నిజానికి భూమి గుండ్రంగా ఉంద‌న్న‌ట్టుగానే.. కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఏడు ఎన్నిక‌లుగా అంటే.. సుమారు 35 సంవ‌త్స‌రాలుగా.. చంద్ర‌బాబు పోటీ చేస్తున్నారు. కొన్ని ఎన్నిక‌లకు ప్ర‌చారం నిమిత్తం వెళ్లినా.. దాదాపు నాలుగైదు ఎన్నిక‌ల నుంచి ఆయ‌న అస‌లు అక్క‌డ ప్ర‌చారం కూడా చేయ‌కుండానే గెలుపు గుర్రం ఎక్కుతున్నారు. అలాంటి నియోజ‌క‌వ‌ర్గం ఇప్పుడు ఎందుకు ఇంత హాట్ టాపిక్ అయింద‌నేది ఆస‌క్తిగా ఉంది. దీనికి ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు ఉన్నాయి.

ఒక‌టి.. వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ వైనాట్ 175 నినాదం అందుకోవ‌డంతో పాటు.. టీడీపీ అధినేత చంద్రబా బును ఓడిస్తే.. ఇంకా త‌మ ఇమేజ్ పెరుగుతుంద‌ని రాజ‌కీయంగా వేసుకున్న అంచ‌నాల‌తో కుప్పం నియోజ క‌వ‌ర్గం చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చింది. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబును ఓడించాల‌నే ఏకైక ల‌క్ష్యంగా ఇక్క‌డ మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీ.. వంటి అనేక మంది ప్ర‌య‌త్నాలు చేయ‌డం.. గ‌త ఏడాది జ‌రిగిన కుప్ప మునిసిపాలిటీని వైసీపీ ద‌క్కించుకోవ‌డంతో ఇక్క‌డి ప‌రిణామాల‌పై మ‌రింత చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది.

స‌ర్వేలు ఏం చెబుతున్నాయి…?
ఇక‌, కుప్పంపై క‌న్నేసిన వైసీపీ నాయ‌కులు.. అభివృద్ధి మంత్రం జ‌పించారు. అదేస‌మ‌యంలో పేరుపేరు నా ప‌థ‌కాలు కూడా అందించారు. అయితే.. స్థానిక నేత‌ల్లో మొద‌లైన కుమ్ములాట‌లు స‌హా.. ప్ర‌జ‌ల్లోనూ.. వైసీపీపై స‌డులుతున్న న‌మ్మ‌కం.. వంటివి వైసీపీ వేస్తున్న ఎత్తుగ‌డ‌లు ఓటివేన‌ని తేలిపోయింది. దీంతో ఇక్క‌డ‌.. వైసీపీ పాగా వేయ‌డం క‌ష్ట‌మేన‌ని.. ప్ర‌స్తుతం ఉన్న బ‌లం కేవ‌లం నేతిబీర‌లో నెయ్యిచంద‌మేన ని.. ప‌లు స‌ర్వేలు చాటుతున్నాయి. అంతేకాదు.. వైసీపీని గెలిపిస్తే.. స్థానికంగా శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య వ‌చ్చినా.. రావొచ్చ‌నే చ‌ర్చ ప్ర‌జ‌ల్లోనూ ఉండ‌డం గ‌మ‌నార్హం.

చంద్ర‌బాబే మ‌ళ్లీ ప‌ట్టం.. వెనుక‌
ఇక‌, ప్ర‌స్తుత కుప్పం ఎమ్మెల్యే, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకే మ‌ళ్లీ ఇక్క‌డి ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టేందుకు రెడీ కావ‌డం వెనుక 2 ప్ర‌ధాన రీజ‌న్లు క‌నిపిస్తున్నాయ‌ని స‌ర్వే చేసిన వారితోపాటు.. టీడీపీ నాయ‌కులు కూడా చెబుతున్నారు. ఒక‌టి.. విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా గుర్తింపు పొందిన చంద్ర‌బాబును ఓడించ‌డం అనే మాట‌ను కుప్పం ప్ర‌జ‌లు జీర్ణించుకోలేక పోవ‌డం.. అస‌లు ఆ మాట అనేందుకు.. వినేందుకు కూడా సాహ‌సించ‌లేక పోవ‌డం. రెండు.. చంద్ర‌బాబు త‌న పొలిటిక‌ల్ లైఫ్‌లో ఇదే చివ‌రి ఎన్నిక‌లు అని ప్ర‌క‌ట‌న చేయ‌డం.

వీట‌న్నింటికీ తోడు.. ప్ర‌జ‌లు కోరుకుంటున్న కీల‌క‌మైన శాంతి భ‌ద్ర‌లు. చంద్ర‌బాబు ఎమ్మెల్యేగా ఉన్నంత వ‌ర‌కు శాంతి భ‌ద్ర‌త‌ల‌కు లోటు లేద‌ని మెజారిటీ ప్ర‌జ‌లు భావిస్తున్న‌ట్టు తాజాగా చేసిన ప‌లు స‌ర్వేలు తేల్చి చెప్ప‌డం.. గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో వైసీపీ ఎంత పెనుగులాడినా.. ప్ర‌యోజ‌నం లేద‌ని.. స‌ర్వేలు తేల్చి చెప్పాయి. అంతేకాదు… చంద్ర‌బాబు విజ‌యం ఖాయ‌మ‌ని 70 వేల మెజార్టీ ప‌క్కా అని… వైసీపీకి చుక్క‌లు క‌న‌ప‌డ‌డం ఖాయ‌మ‌ని అన్ని విశ్లేష‌ణలు చెపుతున్నాయ్‌..!