పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ స్టార్ హీరోగా ఓ రేంజ్లో క్రేజ్ సంపాదించుకున్నాడు. పవన్ కళ్యాణ్ సినిమా మొదటి రోజు మొదటి షో రిలీజ్ అవుతుందంటే థియేటర్ వద్ద ఫ్యాన్స్ రచ్చ మామూలుగా ఉండదు. ఆ సినిమా హిట్, ఫ్లాప్ సంబంధం లేకుండా కోట్లలో కలెక్షన్లు వసూలు చేస్తుంది. ఇక సినిమాలతో పాటు రాజకీయాలను కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ తాజాగా సాయి ధరమ్ తేజ్ తో కలిసి బ్రో సినిమాలో నటించాడు. ఈ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అలా పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలలో లాస్ట్ 5 సినిమాలు తెలుగురాష్ట్రాల ఫస్ట్ డే కలెక్షన్ లెక్క ఒకసారి చూద్దాం .
సర్దార్ గబ్బర్ సింగ్ :
కేఎస్ రవీంద్ర డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా మొదటి రోజు రూ.21.70 కోట్లు కలెక్షన్ వసూలు చేసింది.
కాటమరాయుడు :
పవన్ కళ్యాణ్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా నటించిన సినిమా కాటమరాయుడు. అనుప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమాకు కిషోర్ కుమార్ పార్థసాని డైరెక్టర్గా శరత్ మరర్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా సక్సెస్ కాకపోయినా మొదట రోజు కలెక్షన్స్ మాత్రం అదరగొట్టింది. కాటమరాయుడు మొదటి రోజు రూ.22.27 కోట్ల కలెక్షన్లు కల్లగొట్టింది.
అజ్ఞాతవాసి :
త్రివిక్రమ్ డైరెక్షన్లో అను ఇమ్మానుయేల్, కీర్తి సురేష్ హీరోయిన్లుగా పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన సినిమా అజ్ఞాతవాసి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయినా మొదటి రోజు కలెక్షన్స్ మాత్రం కోట్లలో సంపాదించి పెట్టింది. అజ్ఞాతవాసి మొదటి రోజు రూ.26.40 కోట్ల కలెక్షన్ వసూలు చేసింది.
వకీల్ సాబ్ :
పవన్ కళ్యాణ్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా తెరకెక్కిన ఈ సినిమాలో అంజలి, అనన్య పాండే, నివేద థామస్, ప్రకాష్ రాజ్ కీరోల్ ప్లే చేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా మొదటి డే రూ.32.24 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టింది.
భీమ్లా నాయక్ :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – దగ్గుబాటి రానా కాంబినేషన్లో మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కిన సినిమా భీమ్లా నాయక్. ఈ సినిమాలో నిత్యమీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా మొదటి రోజు మంచి కలెక్షన్స్ ని తెచ్చి పెట్టింది. ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ రూ.26.42 కోట్లు.
బ్రో :
పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో మల్టీ స్టారర్ గా రూపొందిన సినిమా బ్రో తమిళ్ యాక్టర్ డైరెక్టర్ సముద్రఖని డైరెక్షన్లో త్రివిక్రమ్ డైలాగ్స్ తో రూపొందిన ఈ సినిమా తమిళ్ వినోదయ సీతం మూవీకి రీమేక్ గా వచ్చింది. నిన్న రిలీజైన ఈ సినిమా ఫస్ట్ డే రూ.23.61 కోట్లు కలెక్షన్స్ సంపాదించింది.