పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన బ్రో సినిమా ఈరోజు అంటే జులై 28న థియేటర్లలో రిలీజ్ అయింది. సముద్రఖని డైరెక్ట్ చేసి, నటించిన తమిళ్ మూవీ “వినోదయసిత్తం (2021)”కి రీమేక్గా ఈ బ్రో మూవీ రూపొందింది. ఒరిజినల్ మూవీతో పాటు తెలుగు రీమేక్ బ్రోని కూడా సముద్రఖనినే డైరెక్ట్ చేశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించాడు. అయితే ఈ సినిమా చూడాలనుకునే వారు ఒరిజినల్ మూవీకి భిన్నంగా ఇదేం ఆఫర్ చేస్తుందో తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినోదయసిత్తం, బ్రో సినిమాల మధ్య ఉన్న తేడాలేవో ఇప్పుడు తెలుసుకుందాం.
వినోదయసిత్తం కథ తెలుసుకుంటే ఈ సినిమాలో తంబిరామయ్య ఒక సంస్థలో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తుంటాడు. అతడు కంపెనీకి పని మీద వెళ్లి ఆక్సిడెంట్లో చనిపోతాడు. చనిపోయాక తర్వాత అతని ఆత్మ ఎంతో తలడిల్లుతుంది. తన కుటుంబ సభ్యులు ఎలా బతుకుతారు, వారి అలనా పాలనా ఎవరు చూసుకుంటారు అని అతని ఆత్మ సతమతమవుతుంటుంది. ఈ సమయంలోనే టైమ్ (సముద్రఖని ఈ టైమ్ పాత్రని పోషించాడు) అతనికి ఒక అవకాశం వస్తుంది. 90 రోజులపాటు నువ్వు మళ్ళీ బ్రతకొచ్చని జీవితంలో సెకండ్ ఛాన్స్ ఇస్తుంది. ఆ సమయంలో తంబిరామయ్య బతికి జీవితాన్ని మొత్తం ఆస్వాదిస్తాడు. అలాగే కుటుంబాన్ని చాలా గొప్పగా చూసుకుంటాడు. చనిపోక ముందే బతికున్నప్పుడే పిల్లల కోసం, కుటుంబం కోసం మంచి చేయాలనే ఒక సందేశంతో ఈ సినిమా రూపొందింది.
ఇక బ్రో సినిమాలో తంబిరామయ్య పాత్రను సాయిధరమ్ తేజ్ పోషించాడు. టైమ్ రూపంలో వచ్చి సాయిధరమ్ ను మళ్ళీ బతికించిన పాత్రను పవన్ కళ్యాణ్ పోషించాడు. వినోదయసిత్తం జస్ట్ ఐదు కోట్ల రూపాయలతో తెరకెక్కగా బ్రో మూవీ మాత్రం హై బడ్జెట్తో తెరకెక్కింది. ఒరిజినల్ మూవీలో ఒకటే ఒక పాట అది కూడా సందర్భంగా వస్తుంది. బ్రో మూవీలో మాత్రం మొత్తం మూడు పాటలు ఉన్నాయి. వాటిని ఎస్.ఎస్ తమన్ కంపోజ్ చేశాడు. బ్రో సినిమాలో ఎలాంటి యాక్షన్ ఫైట్స్ సన్నివేశాలు ఉండవు కానీ మూవీ లో రెండు ఫైట్ సీక్వెన్స్లు ఉంటాయి. సాయి ధరమ్ తేజ్తో ఒక లవ్ ట్రాక్ కూడా ఉంటుంది. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. వినోదయసిత్తం మూవీ రన్ టైమ్ 99 నిమిషాలే కాగా బ్రో మూవీ రన్ టైమ్ 135 మినిట్స్ వరకు ఉంటుంది.