బాహుబలి సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన సినిమా ఆది పురుష్. ఇదే సమయంలో బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత భారీ విజయం కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ తన ఆశలన్నీ ఈ సినిమా మీదే పెట్టుకున్నాడు. ఇక బాలీవుడ్ స్టార్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే బెనిఫిట్ షోలు కంప్లీట్ చేసుకున్నఈ సినిమా ప్రీమియర్ షో ల నుంచి మంచి టాక్ అని తెచ్చుకుంది.
ఇప్పటికే రామాయణం కథ ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. నేటితరం జనరేషన్లో ఎవరూ చేయని సాహసాన్ని దర్శకుడు చేశాడు. డైరెక్టుగా కథను నేటితరం ప్రేక్షకులకి నేటి యువతరానికి అర్థమయ్యే విధంగా తెరకెక్కించడం ఈ సినిమాకి ప్లస్. ఈ సినిమాపై మొదటి నుంచి వి ఎఫ్ ఎక్స్ ఎఫెక్ట్స్ నాసిరకంగా ఉన్నాయంటూ ఎన్నో కామెంట్లు వచ్చిన ఫైనల్గా సినిమాపై మళ్లీ అదే కామెంట్ వినిపించింది.
ఈ సినిమా ఆడుతున్న థియేటర్లో ప్రతి షో కి ఒక సీట్ను ఆంజనేయస్వామికి కేటాయించాలని దర్శకుడు ఓంరౌత్ డిస్టిబ్యూటర్లను కోరిన విషయం అందరికీ తెలిసిందే. రామాయణం ఎక్కడ పారాయణం చేస్తే అక్కడ హనుమంతుడు వస్తారని పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆది పురుష్ సినిమా కోసం ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకున్నాడు ఓం రౌత్. అయితే ఇప్పుడు దర్శకుడు చెప్పింది నిజమైంది.
ఇప్పుడు ఆది పురుష్ సినిమాను చూడడానికి హనుమంతుడు నిజంగానే వచ్చేసాడు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆది పురుష్ సినిమా ప్రదర్శిస్తున్న ఒక థియేటర్లో కోతి ప్రత్యక్షమైంది. ఇక ఆ థియేటర్ కిటికీలోనుంచి వచ్చిన కోతి ఆదుపురుష్ సినిమాను కన్నార్పకుండా కొంతసేపు చూసింది. అయితే ఇది ఎక్కడ జరిగింది అన్నదు తెలియదు కాని.. తెలుగు రాష్ట్రాల్లోనే కోతి ఆదిపురుష్ సినిమా చూసినట్టు చెపుతున్నారు. ఆదుపురుష్ చిత్ర యూనిట్ ఆ వీడియోని రీట్వీట్ చేసింది. ప్రస్తుతం హనుమంతుడు వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Hanumanji watching the movie #JaiShriRam #JaiBajarangBali #Adipurush https://t.co/jTNDYfNMz5
— #Adipurush 🇮🇳 (@rajeshnair06) June 16, 2023