టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా తర్వాత తన 28వ సినిమాను స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ చేస్తున్నాడు. ఈ సినిమాకు గుంటూరు కారం అనే మాస్ టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఈ సినిమా విషయంలో అసలు ఏం జరుగుతుందో ? ఎవరు ఈ సినిమాలోకి వస్తున్నారు బయటికి వెళ్తున్నారు అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఇక గత కొద్ది రోజులుగా ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అవుట్ అంటూ వార్తలు వస్తున్నాయి.. ఇక ఇప్పుడు థమన్తో పాటు హీరోయిన్ పూజ హెగ్డే కూడా ఈ సినిమా నుంచి తప్పించారని అంటున్నారు.
ప్రధానంగా ఈ సినిమాలో మరో హీరోయిన్ శ్రీలీలా కూడా నటిస్తుంది. ఆమె కారణంగానే పూజా హెగ్డే ఈ సినిమా నుంచి తప్పుకుందని.. అలాగే పూజా స్థానంలో సంయుక్త మీనన్ హీరోయిన్ అంటూ మరికొందరు అంటున్నారు. అంతేకాకుండా పూజ హెగ్డే యాక్టింగ్ నచ్చకనే త్రివిక్రమ్ ఆమెను బయటకు తోసేసారని ఇంకొందరు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇందులో ఏది నిజమో ఏది అబద్దమో ఇప్పటికీ ఎవరికీ తెలియదు.
ఇక ఇప్పుడు ఇవన్నీ పక్కనపడితే తాజాగా ఈ గుంటూరు కారం సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. పూజా హెగ్డే స్థానంలో మీనాక్షి చౌదరిని హీరోయిన్గా తీసుకున్నారని తెలుస్తుంది. ఈ విషయంపై త్వరలోనే అధికార ప్రకటన రానుంది. తెలుగులో ఇచ్చట వాహనాలు నేలపరాదు సినిమాతో మీనాక్షి ఎంట్రీ ఇచ్చింది. అయితే తొలి సినిమా ఆమెకు ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది. అయినా ఈమెకు అవకాశాలు మాత్రం బాగానే అందుకుంది.
అలాగే రవితేజ ఖిలాడి చేసినా నిరాశ పరిచింది. ఆ తర్వాత హిట్2 సినిమాతో భారీ విజయం అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అలా మొదటి విజయం అందుకున్న ఈ ముద్దుగుమ్మ తన పేరును అందరు గుర్తుంచుకునేలా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ బాగా ఫేమస్ అయింది. ఈన్నాళ్లకు మీనాక్షి టాలెంట్ త్రివిక్రమ్ కంటపడింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు మహేష్ బాబు తో నటించే అవకాశం కొట్టేసింది ఈ హీరోయిన్. ఏదేమైనా మహేష్ సినిమా ఛాన్స్తో ఆమె ఒక్కసారిగా పెద్ద తోపు హీరోయిన్ అయిపోయింది.