టాలీవుడ్ మాస్ హీరో నందమూరి నటసింహ, నయనతార నటించిన చిత్రం ‘ జై సింహ ‘ . ఈ చిత్రంలో మరో హీరోయిన్ కూడా ఉంది. మలయాళ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ముంబై ముద్దుగుమ్మ నటాషా దోషి. ఆ సినిమాలో ఆమె బాలయ్యతో అమ్మ కుట్టి అమ్మ కుట్టి అనే సాంగ్లో వేసిన స్టెప్పులు మన తెలుగు ప్రేక్షకులు ఎప్పటకీ మర్చిపోలేరు. బాలయ్య కుర్చీ స్టెప్తో ఈ సాంగ్లోనే తన డ్యాన్స్ విశ్వరూపం చూపిస్తాడు.
ఈ సినిమా తర్వాత నటాషా తెలుగులో కోతల రాయుడు అనే సినిమాలో నటించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు తెలిపింది. తనకు కాబోయే భర్తతో ఉంగరాలు మార్చుకునే ఫోటోలు కూడా అప్లోడ్ చేసింది. “ప్రేమ ఎప్పుడూ గెలుస్తుంది”అంటూ ఫోటో కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసింది. దీంతో వీరిది లవ్ మ్యారేజ్ అని తెలుస్తుంది. ఇది చూసిన ఫ్యాన్స్ కంగ్రాచ్యులేషన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
జై సింహా సినిమాతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది నటాషా దోషి. అంతకుముందు ఈ ముద్దుగుమ్మ మలయాళం లో నాలుగు సినిమాల్లో నటించింది. జై సింహా తర్వాత శ్రీకాంత్ సరసన “కోతల రాయుడు”అనే చిత్రంలో కనిపించింది. అంతేకాకుండా కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ఎంత మంచివాడవురా సినిమాలో ఒక సాంగ్ లో చేసింది. ఇప్పుడు ఆమె ఎంగేజ్మెంట్ ఫోటోలు ట్విట్టర్లో వైరల్గా మారాయి.