ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్. వివేకా నంద రెడ్డి కేసులో కడప ఎంపీ వైఎస్. అవినాష్ రెడ్డితో పాటు అతడి తండ్రి భాస్కర్ రెడ్డిపై రకరకాల ఆరోపణలు వచ్చాయి. పోలీసులు ఇప్పటికే అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేశారు. ఇక ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రాగా.. ఇప్పుడు వివేక కుమార్తె సునీత అవినాష్ను వదల బొమ్మాలీ అన్నట్టుగా పోరాటం చేస్తున్నారు.
తాజాగా అవినాష్ ముందస్తు బెయిల్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో సునీత పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైఎస్ వివేకా కుమార్తె సునీత తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై సునీత పిటిషన్ వేశారు. ఇక తెలంగాణ హైకోర్టు ఈనెల 25 వరకు అవినాష్ను అరెస్టు చేయవద్దని చెప్పింది.
జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం ముందు సునీత తరఫు న్యాయవాదులు ఈ ప్రస్తావన తీసుకువచ్చారు. ఇక
సునీత పిటిషన్పై రేపు విచారణ చేపడతామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఏదేమైనా అవినాష్ రెడ్డి బెయిల్ ఆనందం కొద్ది గంటల్లోనే మళ్లీ ఉత్కంఠగా మారింది. ఈ కేసు విషయంలో సునీత ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదని తెలుస్తోంది.