ఒకప్పుడు హీరోయిన్లుగా నటించిన చాలా మంది ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్నారు. ఆ లిస్టులో మాధవి రెడ్డి కూడా ఒకరు. మాధవి రెడ్డి ఆర్. నారాయణమూర్తి హీరోగా మార్కెట్లో ప్రజాస్వామ్యం అనే సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా తర్వాత మాధవి రెడ్డి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే మాధవి రెడ్డి స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేకపోయారు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు.
నాగచైతన్య హీరోగా నటించిన మజిలీ, పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలతో పాటు అనేక చిత్రాలలో మాధవి రెడ్డి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. అంతేకాకుండా ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ సీరియల్స్ లోను మాధవి రెడ్డి నటిస్తున్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కెరీర్ ప్రారంభంలో రెండు సినిమాలలో హీరోయిన్ గా నటించినా ప్రస్తుతం తల్లి పాత్రలకే పరిమితమయ్యానని…. దాని కారణం ఏంటని యాంకర్ ప్రశ్నించగా ఇంట్రస్టింగ్ ఆన్సర్ చేసింది.
నేను కొన్ని పరిమితులు పెట్టుకున్నాను. నేను ఏదైనా పాత్రలో నటిస్తే దానివల్ల నా కుటుంబానికి ఇబ్బంది కలగక కూడదని అన్నారు. కేవలం తల్లి పాత్రల్లో మాత్రమే నటిస్తానని ముందే చెప్పానని అన్నారు. ఒకవేళ సెట్ కి వెళ్ళాక అది కూడా నచ్చకపోయినా నిర్మొహమాటంగా చెప్పి వెనక్కి వచ్చేస్తానని అన్నారు. ఇక మీ కెరీర్ లో అలా వెనక్కి వచ్చిన సంఘటనలు ఉన్నాయా….? అని యాంకర్ ప్రశ్నించగా… చిరంజీవి సినిమాలో ఆయన ముందు పైట జార్చుకునే సన్నివేశం ఒకటి ఉందని అన్నారు.
సెట్ కి వెళ్ళాక ఆ సన్నివేశం గురించి చెప్పారని అన్నారు. దాంతో వెనక్కి వచ్చేసానని చెప్పారు. ఇప్పటికీ అలాంటి క్యారెక్టర్ లు వస్తుంటాయని…. కానీ నేను అలాంటివి చేయనని చెప్పారు. ఎక్స్పోజింగ్ చేయడం లాంటివి నేను చేయను….. నా కూతురిని ఎవరైనా మీ అమ్మగారు ఇలాంటి పాత్రలు చేశారు. అని ప్రశ్నించకూడదు అని చెప్పారు. అందువల్లే అలాంటి పాత్రలకు దూరంగా ఉంటానని అన్నారు.