ఆ 4 నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ఫేట్ సింగిల్ హ్యాండ్‌తో మార్చేసిన లోకేష్‌… !

టీడీపీ విష‌యంలో కొన్ని ఆశ్చర్య‌క‌ర సంఘ‌ట‌న‌లు వెలుగు చూస్తున్నాయి. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు, ఆయ న కుమారుడు పార్టీ యువ నేత నారా లోకేష్ కూడా ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటున్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ..నారా లోకేష్ యువ‌గ‌ళం పాద‌యాత్ర చేస్తున్నారు. మ‌రోవైపు..చంద్ర‌బాబు ఇదేం ఖ‌ర్మ మన రాష్ట్రానికి నిర్వ‌హిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఎక్క‌డ చూసినా టీడీపీ పేరు మార్మోగుతోంది.

TDP leader Nara Lokesh embarks on 4000 km-long statewide padayatra | The  News Minute

ఎక్క‌డ విన్నా చంద్ర‌బాబు , నారా లోకేష్‌ల పేరు వినిపిస్తున్నాయి. మ‌రీ ముఖ్యంగా యువ‌గ‌ళం పాద‌యా త్ర పూర్త‌యిన రెండు జిల్లాల్లోనూ టీడీపీకి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఈ ఏడాది జ‌న‌వ‌రి 27న ప్రారంభించిన యువ‌గ‌ళం పాద‌యాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు 77 రోజులు పూర్త‌యింది. ఈ 77 రోజుల్లోనూ కొన్ని విరామాలు ఉన్న‌ప్ప‌టికీ.. పూర్తిగా చిత్తూరు జిల్లాలోనూ.. అనంత‌పురం జిల్లాలోనూ..యాత్ర పూర్త‌యింది.

Nara Lokesh's Yuvagalam padayatra marks one-month milestone in Chittoor and  Tirupati districts | Amaravati News - Times of India

ఈ రెండు జిల్లాల్లోని అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ దాదాపు యాత్ర క‌వ‌ర్ చేసింది. దీంతో టీడీపీలో ఉన్న అసంతృప్తులు దాదాపు తొలిగిపోయాయి. అదే స‌మ‌యంలో కొన్నినియోజక‌వ‌ర్గాల్లో నేత‌ల‌ను కూడా ప్ర‌క టించ‌డం.. పార్టీకి క‌లిసి వ‌చ్చింది. ప్ర‌ధానంగా చిత్తూరులో పార్టీ నాయ‌క‌త్వానికి ఇబ్బందిగా ఉన్న చంద్ర‌గిరి, పీలేరు, పుంగ‌నూరు, తిరుప‌తి నియోజ‌క‌వ‌ర్గాల్లో యువ‌గ‌ళం పాద‌యాత్ర క‌లిసివ‌చ్చింది.

Lokesh bids adieu to family, begins 400 days Yuva Galam padayatra

అదే స‌మయంలో అనంత‌పురం జిల్లాలోనూ యువ‌గ‌ళం పాద‌యాత్ర నేత‌ల‌ను ఏక‌తాటిపైకి తీసుకువ‌చ్చిం ది. ఎక్కడిక‌క్క‌డ నాయ‌కులు పుంజుకున్నారు. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు ఎక్కువ‌గా ఉన్న తాడిప‌త్రి, పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ప‌రిస్థితి కుదుట‌ప‌డింద‌ని తెలుస్తోంది. అదే స‌మ‌యంలో వైసీపీ నేత‌ల అక్ర‌మాల‌ను నారా లోకేస్ బ‌య‌ట పెడుతున్న తీరు కూడా ప్ర‌జ‌ల్లోకి బాగా వెళ్తోంద‌నే టాక్ వినిపిస్తోంది. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ గెలుపుఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.