సమంత – దేవ్ మోహన్ ప్రధానపాత్రలలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా సినిమా శాకుంతలం. మైతలాజికల్ కథాంశంతో తెర్కెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. పైగా రుద్రమదేవి లాంటి హిస్టారికల్ సినిమా తర్వాత గుణశేఖర్ 8 సంవత్సరాలు సుదీర్ఘంగా గ్యాప్ తీసుకుని తెరకెక్కించిన సినిమా శాకుంతలం. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సమర్పణలో గుణా టీం బ్యానర్ పై గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ ఎంతో గ్రాండ్గా ఈ సినిమా నిర్మించారు.
ఈ సినిమాకు ఏకంగా రు. 64 కోట్ల భారీ బడ్జెట్ అయింది. మణిశర్మ సంగీతం, శేఖర్ వి. జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈరోజు శాకుతలం ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాకు ఇప్పటికే ప్రీమియర్ షోలు వేశారు. అయితే రిలీజ్ రోజున ఆడే హైదరాబాదులో శాకుంతలంకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాదులో అతిపెద్ద మల్టీప్లెక్స్ అయినా ప్రసాద్ ఐమాక్స్లో ఈరోజు శాకుతలం షోలు అన్ని క్యాన్సిల్ అయ్యాయి.
ఈరోజు హైదరాబాదులో ఏర్పాటు చేయబడ్డ అతిపెద్ద అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరుగుతోంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. అందువల్ల విపరీతమైన ట్రాఫిక్ ఉంటుందన్న కారణంతో ఈరోజు శాకుంతలం యొక్క అన్ని షో లు క్యాన్సిల్ అయ్యాయి. ఈ సినిమా అభిమానులు అందరూ ఈ విషయాన్ని గ్రహించి ఇతర మల్టీప్లెక్స్ లలో ఈ సినిమాని చూడాలని గత రాత్రి ఈ మూవీ టీం ఒక ప్రకటన ద్వారా తెలిపింది.
అయితే తొలి రోజు ప్రసాద్ ఐ మ్యాక్స్ దగ్గర సినిమా ఉంటే ఎలాంటి సందడి ఉంటుందో చెప్పక్కర్లేదు. ఇప్పుడు శాకుతలంకు ఆ క్రేజ్ మిస్ అయ్యింది. అయితే శనివారం నుంచి యధావిధిగా ప్రసాద్ మల్టీప్లెక్స్లో శాకుంతలం షోలు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు.