ఉమ్మడి కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గం అంటే..ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అడ్డాగా ఉండేది..ఇప్పుడు వైసీపీ కంచుకోటగా మారింది. సరే ఇప్పుడైనా వైసీపీపై కాస్త వ్యతిరేకత పెరుగుతుంది..కాబట్టి టిడిపి బలం పెరుగుతుందా? అంటే అది చెప్పలేని పరిస్తితి. అసలు టిడిపి ఇక్కడ చివరిగా గెలిచింది 2009 ఎన్నికల్లో..ఇక 2014, 2019 ఎన్నికల్లో టిడిపి వరుసగా ఓడిపోతూ వస్తుంది.
సరైన నాయకుడు లేకపోవడం వల్లే నూజివీడులో టిడిపికి ఓటములు ఎదురవుతున్నాయి. అయితే 2014 నుంచి పక్కనే ఉన్న గన్నవరం నుంచి ముద్దరబోయిన వెంకటేశ్వరరావుని తీసుకొచ్చి నూజివీడులో పెట్టారు. ఆయన అప్పటినుంచి నూజివీడులో పార్టీ కోసం పనిచేస్తున్నారు. కానీ వరుసగా ఆయనని ఓటములు పలకరిస్తున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు.
అయితే ఇలా టిడిపి వరుసగా ఓడిపోవడానికి కారణం వైసీపీ బలంగా ఉండటం కాదు..టిడిపి నేతల మధ్య సమన్వయం లేకపోవడం. ఇక్కడ బలమైన టిడిపి క్యాడర్ ఉంది. క్యాడర్కు ఎలాంటి కొదవ లేదు. అయితే బీసీ నేతగా ఉన్న ముద్దరబోయినకు..అక్కడ బలంగా ఉన్న కమ్మ సామాజికవర్గం నేతల నుంచి పూర్తి సపోర్ట్ వస్తున్నట్లు కనిపించడం లేదు. పైగా కొందరు కమ్మ నేతలు సెపరేట్ గా కార్యక్రమాలు చేస్తున్నారు.
ఇలా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ముందుకెళుతున్నారు. ఇలా టిడిపి నేతల మధ్య ఐక్యత లేకపోవడమే వైసీపీ బలం. అంతే తప్ప ఇక్కడ వైసీపీ బాగా బలంగా ఉందని చెప్పడానికి లేదు. పైగా ఇప్పుడు వైసీపీపై వ్యతిరేకత కూడా ఉంది. దీన్ని టిడిపి ఉపయోగించుకోవడం లేదు.
ముద్దరబోయిన కష్టపడుతునా..కొందరు నేతల నుంచి సహకారం రావడం లేదు. దీని వల్ల నూజివీడులో టిడిపికి పట్టు దొరకడం లేదు. ఇలా సొంత తప్పిదాలు వల్లే నూజివీడులో టిడిపి వరుసగా ఓడిపోయే పరిస్తితి. ఈ సారైనా కలిసికట్టుగా పనిచేస్తే టిడిపి గెలిచే అవకాశాలు ఉన్నాయి.