నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. ఆరుపదుల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా యంగ్ హీరోలకు సమానంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. అయితే బాలయ్య తన సినీ కెరీర్ లో ఓ పాత్ర కోసం ఎంతో పెద్ద సాహసమే చేశారు. అంతేకాదు ఆ పాత్ర కోసమేకంగా 10 రోజులు పాటు అన్నం కూడా తినలేదట. ఆ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
తాము చేసే పనిని దైవంగా భావించి అంకితభావంతో పనిచేసే స్టార్ హీరోల్లో నటసింహం నందమూరి బాలకృష్ణ ఎప్పుడు ముందు వరసలోనేే ఉంటారు. తాను చేసే పని పట్లల క్రమశిక్షణ, నిబద్ధతను తన తండ్రి నటరత్న ఎన్టీఆర్ దగ్గర నుంచి పునికి పుచ్చుకొని హిట్, ప్లాప్లతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంతే కాకుండా తాను చేసే సినిమాల్లో ఎన్నో ప్రయోగాత్మక పాత్రలు కూడా చేస్తూ మాస్ హీరోగా రాణిస్తున్న సమయంలోనే భైరవద్వీపం లాంటి జానపద సినిమాను కూడా చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
టాలీవుడ్ సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ మన తెలుగు చిత్రపరిశ్రమలోనే ఓ గొప్ప కళాఖండంగా మిగిలిపోయింది. అలాంటి ఈ గొప్ప సినిమాని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అయ్యారు బాలయ్య అభిమానులు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మాస్ హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలో చేస్తున్న సమయంలోనే బాలయ్య భైరవద్వీపం సినిమా చేయడం ఒక ఎత్తు అయితే ఈ సినిమాలో కురూపిగా నటించడానికి ఒప్పుకోవడం మరోసాహసమనే చెప్పాలి.
ఎందుకంటే ఆ సమయానికి రౌడీ ఇన్స్పెక్టర్, బంగారు బుల్లోడు, నిప్పురవ్వ , వంటి బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు బాలయ్య. అలాంటి సమయంలో సింగీతం శ్రీనివాసరావు భైరవద్వీపం కథతో బాలకృష్ణ వద్దకు వచ్చారు. ఇక కథ నచ్చాడంతో మరో ఆలోచన లేకుండా ఆ సినిమాకు ఓకే చేశారు. అంతేకాకుండా కథలో భాగంగా కురూపిగా నటించటానికి కూడా సై అన్నారు.
అలా బాలకృష్ణ ఈ సినిమాలో కురూపిగా నటించడం ఓ గొప్ప సాహసమనే చెప్పాలి.
ఆ కురూపి క్యారెక్టర్ కోసం బాలకృష్ణ పది రోజులు భోజనం లేకుండా అదేవిధంగా ఆ క్యారెక్టర్కు మేకప్ వేయడానికి కనీసం 2 గంటల సమయం పట్టేది. ఒక్కోసారి మేకప్ వేశాక సాయంత్రం వరకు తీయడానికి వీలయ్యేది కాదు. కానీ భోజనం చేయాలంటే మేకప్ తీయాల్సిందే ఒకవేళ మేకప్ తీస్తే మళ్లీ రెండు గంటలు సమయం పట్టేది. అందుకే సమయం వృధా చేయకూడదని దాదాపు పది రోజుల పాటు కేవలం జ్యూస్లు తాగుతూ అన్నం తినకుండా ఆ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఈ విధంగా బాలకృష్ణ ఈ సినిమా కోసం తన ప్రాణం పెట్టి నటించాడనే చెప్పాలి. అందుకే ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది.