తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.. స్నేహానికి విలువ ఇచ్చే వ్యక్తి కూడా చిరంజీవి. అయితే చిరంజీవి సినిమా అవకాశాల కోసం చెన్నై వచ్చిన సమయంలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందేే రోజుల్లో ఆయనకు అక్కడ సుధాకర్, హరిప్రసాద్ మంచి మిత్రులుగా మారారు. ఇక వారు కూడా టాలీవుడ్లో అగ్ర నటులుగా ఎదిగారు. చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగినా సమయంలో హరిప్రసాద్, సుధాకర్ కు మాత్రం అవకాశాలు వచ్చేవి కావు.. చిరంజీవి ఎంత చెప్పినా వారికి చిన్న చిన్న పాత్రలు ఇచ్చేరు.
ఇక దాంతో ఇలా కాదు అని ఒక నిర్ణయం తీసుకోవాలని భావించి వారికోసం ఆయనే ఓ సినిమా చేసి తన స్నేహం గొప్పతనాన్ని చాటిచెప్పారు. అలా చిరంజీవి తన స్నేహితుల కోసం చేసిన సినిమానే యముడికి మొగుడు.. అంతకుముందు దేవాంతకుడు సినిమాని నిర్మించిన మరో నటుడు నారాయణరావు కూడా ఈ సినిమా నిర్మాణంలో సహ నిర్మాతగా ఉన్నారు. చిరంజీవి అనుకున్నట్టుగానే ఈ సినిమాలో సుధాకర్, హరిప్రసాద్ లకు మంచి రోల్స్ వచ్చాయి తర్వాత వారికి మంచి మంచి ఆఫర్లు కూడా వచ్చాయి.
ఈ సినిమా చిరంజీవి ద్విపాత్రాభినయంతో తెరకెక్కిన ‘యముడికి మొగుడు’ సినిమాకి రవి రాజా పినిశెట్టి దర్శకత్వం వహించారు. మరో సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ యముడిగా నటించారు. హెవెన్ కెన్ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో చిరుకు జంటగా విజయశాంతి- రాధ హీరోయిన్లగా నటించారు. ఇక ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. అదే విధంగా చిరంజీవి డైలాగులకు యువత బాగా కనెక్ట్ అయ్యారు.
చాలా కేంద్రాల్లో ఈ సినిమా 100 రోజులకు పైగా ఆడింది. ఇక దాంతో యముడికి మొగుడు సినిమా శత దినోత్సవం చేశారు. అదే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో శతదినోత్సవం నాడే చిరంజీవి ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ సభ్యులను పిలిపించి, వారికి ఆర్ధిక సాయం అందించారు. ఇలా తన మానవత్వం చాటుకున్నారు. అప్పుడే కాదు.. గుప్త దానాలు చేయడంలోనూ చిరంజీవి ముందున్నారు.