‘ బ్రో ‘ సినిమా ఫ‌స్ట్ డే చూస్తారా.. అయితే మీ కోరిక తీర‌న‌ట్టే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఫాంటసీ కామెడీ సినిమా బ్రో. కోలీవుడ్‌లో హిట్ అయిన వినోద‌య సీతం సినిమాకు రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ బ్రో మూవీ ఈ నెల 28న థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ సినిమా రిలీజ్ అయ్యేందుకు మ‌రి కొద్ది గంట‌ల టైం మాత్ర‌మే ఉంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా బ్రో ఫీవ‌ర్ ప‌ట్టుకుంది. అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా స్టార్ట్ అయ్యాయి.

కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాకు ప్రముఖ త‌మిళ‌ నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే బ్రో సినిమాకు సంబందించిన అడ్వాన్స్ బుకింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ అయ్యాయి.

అలా ఓపెన్ అయ్యాయో లేదా చాలా చోట్ల టిక్కెట్లు హాట్ కేకుల్లా అయిపోతున్నాయి. ఈ ఊపు చూస్తుంటే బ్రో సినిమా ను ఫ‌స్ట్ డే చూడాలంటే ఫ్యాన్స్‌కు క‌ష్టంగానే ఉంది. ఫ‌స్ట్ డే టాక్‌ను బ‌ట్టి గాని రెండో రోజు అయినా టిక్కెట్లు దొరుకుతాయో లేదో చెప్ప‌లేని ప‌రిస్థితి. ఏదేమైనా బ్రో ఫీవ‌ర్ మామూలుగా లేదు.