బిగ్‌బ్రేకింగ్‌: వ‌ర‌ల్డ్‌క‌ప్ క్రికెట్లో భార‌త్ – పాకిస్తాన్ మ్యాచ్ క్యాన్సిల్‌

భారత్ – పాకిస్తాన్ జ‌ట్ల మధ్య ఈ ఏడాది భారతలో జరిగే ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా జరగాల్సిన మ్యాచ్‌పై ముందు నుంచి అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. పాకిస్తాన్ నిర్వహించే ఆసియా కప్పులో పాల్గొనేందుకు భారత్ పాక్ వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు పాక్ భారత్‌కు వస్తుందా ? రాధా అన్న సందేహాల మధ్య ఎట్టకేలకు అంగీకరించింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 15న షెడ్యూల్ ప్రకారం భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య అహ్మదాబాద్ లో జరిగే మ్యాచ్ ఇప్పుడు వాయిదా పడనుందని స‌మాచారం.

అసలు పాకిస్థాన్ ముందు నుంచి అహ్మదాబాద్ లో భారత్తో ఆడేందుకు నిరాకరించింది. తమ జట్టు భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. అయితే బీసీసీఐ తో పాటు ఐసిసి పాక్ అహ్మ‌దాబాద్‌లో ఆడ‌న‌నేందుకు తగిన కారణాలు చూపకపోవడంతో ఈ మ్యాచ్ ను అహ్మదాబాద్ లోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ దాయాదుల సమరాన్ని రీ షెడ్యూల్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి.

అక్టోబర్ 15న దేవీ నవరాత్రులకు మొదటి రోజు కావడం.. అందులోనూ ఈ పండుగను ఎంతో వైభవంగా జరుపుకునే అహ్మదాబాద్ లో మ్యాచ్ జరుగుతుండడంతో భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తుతాయని.. అందుకే ఈ మ్యాచ్‌ను రీ షెడ్యూల్ చేసుకోవాలని పలు సెక్యూరిటీ ఏజెన్సీలు బీసీసీఐకి సూచించినట్టు తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ కూడా స్పందించినట్టు సమాచారం.

భారత్ పాక్ లాంటి హై వోల్టేజ్ మ్యాచ్ వీక్షించేందుకు ప్రత్యక్షంగా కూడా వేలాదిమంది అభిమానులు అహ్మదాబాద్ కు చేరుకోనున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ జరిగితే దేవీ నవరాత్రుల పండుగ కారణంగా విధించే ఆంక్షల కారణంగా క్రీడా ప్రేమికులు వాళ్ళు ఇబ్బందులకు గురవుతారని సెక్యూరిటీ ఏజెన్సీలు తమ నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

షెడ్యూల్ కంటే ఒకరోజు ముందు నిర్వహిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని.. వారు తమ నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా షెడ్యూల్ ప్రకారం భారత్ – పాక్‌ మ్యాచ్ జరగకపోతే ముందుగా టిక్కెట్లు కొనుగోలు చేసిన వారు ముందుగా అహ్మదాబాద్లో వస‌తి ఏర్పాట్లు చేసుకున్న వారు చాలా ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి.