టాలీవుడ్ లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా అందరితో కలిసి మెలిసి ఉంటారు. వెంకటేష్ కు తన సినిమాలే తన ప్రపంచం. ఎవరితోనూ తన పరిధికి మించి టచ్ లో ఉండేందుకు ఆసక్తి చూపించరు. ఎక్కువగా ఫ్యామిలీ కథా చిత్రాలలో నటించి సూపర్ హిట్లు కొట్టిన వెంకటేష్ హిట్లు.. ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. వెంకటేష్ తో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు ముందు వరుసలో ఉంటారు.
ఎందరో దర్శకలతో కలిసి పనిచేసిన వెంకటేష్ కు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అయితే టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు తేజ మాత్రం తను వెంకటేష్ తో చచ్చినా సినిమా చేయను అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం తేజ చేసిన ఈ కామెంట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతున్నాయి. అసలు వీరిద్దరి మధ్య ఏం ? జరిగింది.. తేజ ఎందుకు వెంకటేష్ తో సినిమా చేయనన్నాడు అన్నది చూస్తే తెరవెనక ఓ ఆసక్తికర పరిణామం కనిపిస్తుంది.
గతంలో తేజ వెంకటేష్ తో సావిత్రి అనే టైటిల్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నారు. వెంకటేష్కు అది కూడా చెప్పాడట. సురేష్ బాబు కూడా ఈ కథ విన్నాడు.. అయితే వెంకటేష్ కథలో కొన్ని మార్పులు చేసుకు రమ్మని చెప్పాడట. తేజ సావిత్రి కథలో మార్పులు చేస్తున్న క్రమంలోనే సడన్గా వెంకటేష్ మరో డైరెక్టర్ తో సినిమా అనౌన్స్ చేసేసాడట. దీంతో తేజకు పిచ్చ కోపం వచ్చేసిందట. భవిష్యత్తులో కూడా తాను ఎప్పుడు వెంకటేష్ తో సినిమా తీయని నిర్ణయించుకున్నాడట.
ఒకవేళ ఆ హీరో తో సినిమా చేయాల్సి వస్తే సావిత్రి కథతోనే సినిమా చేస్తానని తేజ చెప్పుకొచ్చాడు. ఇక సావిత్రి కథతో తేజ తెరకెక్కించాల్సిన ఈ సినిమా అప్పట్లో క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత ఇదే టైటిల్ తో నారా రోహిత్ హీరోగా మరో సినిమా రిలీజ్ అయింది.. ఆ సావిత్రి కూడా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ఇక తేజ రీసెంట్గా సురేష్ బాబు రెండో కుమారుడు అభిరామ్ హీరోగా వచ్చిన అహింస సినిమాకు దర్శకత్వం వహించగా ఆ సినిమా డిజాస్టర్ అయింది.