కొంతకాలంగా విజయ్ దేవరకొండ, అనసూయ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న వార్ గురించి అందరికీ తెలిసిందే. ఓ టైంలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ హద్దులు మీరు మరి అనసూయపై కామెంట్ చేశారు. దానికి స్పందిస్తూ అనసూయ కూడా అదే రేంజ్ లో రిప్లై ఇచ్చింది. కొంతకాలంగా కంటిన్యూస్గా జరుగుతున్న ఈ వార్ నుంచి అనసూయ స్వచ్ఛందంగా సైడ్ అయిపోయింది.
నేను మానసికంగా ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నానని.. ఇకపై ఇలాంటి గొడవలు కొనసాగించడం నాకు ఇష్టం లేదని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ విషయంపై ఇంతగా రచ్చ జరుగుతుంటే విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ మాత్రం కేవలం ఓవైపు నుంచి వచ్చిన కామెంట్స్ మాత్రమే నాకు తెలుసని.. అసలు గొడవే ఏంటి? అనే విషయం నాకు అర్థం కాలేదంటూ అమాయకంగా సమాధానం ఇచ్చాడు.
అసలు మా అన్నయ్యకు, అనసూయకు మధ్యన ఇష్యూ ఏం లేదు. ఇదంతా ఓవైపు నుంచి మాత్రమే జరుగుతున్న కామెంట్రీ అంతకుమించి వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది నేను చెప్పలేను.. ఇంకా చెప్పాలంటే వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ ఏంటనేది కూడా నాకు తెలియదు. ఇలాంటి ఆవేశాలకి.. కోపాలకు సోషల్ మీడియానే మెయిన్ రీజన్ గా ఉందన్నాడు. ఇక రియల్ లైఫ్ లో ఒకడిని రోడ్డుపై చూసి అలాంటి పేరు పెట్టుకున్నావు ఏంటి ? అని ఎవరు కామెంట్ చేయరు. అదే సోషల్ మీడియా వేదికగా అయితే ఆ పేరుపై అనేక రకాలుగా కామెంట్స్ చేస్తూ పర్సనల్ రెచ్చగొడుతుంటారని వాపోయడు.
సోషల్ మీడియా అనేది ఓ సైకలాజికల్ ఎక్స్పరిమెంటరీ ల్యాబ్ లాగా తయారయిందని.. మనకు తెలియకుండా మనం అందులో జాయిన్ అయిపోయామంటూ స్పందించాడు ఆనంద్. ఇక తాజాగా ఆనంద్ దేవరకొండ నటించిన బేబీ సినిమాని మెచ్చుకుంది అనసూయ. దీంతో ఆనంద్ ఆనందం వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు తన సినిమాలేవి సరైన సక్సెస్ సాధించలేదని… ఆ కిక్ ఎలా ఉంటుందో బేబీ సినిమాతో ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నట్టు చెప్పాడు.