ఇటీవల కాలంలో చాలా మంది స్టార్ హీరోయిన్స్ వారితో కలిసి నటించిన స్టార్ ఫ్యామిలీ హీరోస్తోనే ప్రేమలోపడి.. పెళ్లి చేసుకుని స్టార్ హీరోలకు భార్యలు అయిపోతున్నారు. బాలీవుడ్లో ఈ ట్రెండ్ ఎక్కువుగా నడుస్తోంది. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్తో ఎంగేజ్మెంట్ చేసుకొని మెగా కోడలిగా అడుగు పెట్టడానికి సిద్ధమైంది హీరోయిన్ లావణ్య త్రిపాఠి. త్వరలోనే వివాహ బంధంతో ఈ జంట ఒకటి కాబోతున్నారు.
అయితే ప్రస్తుతం మరో క్రేజీ హీరోయిన్ మెగా కుటుంబానికి కోడలు కాబోతుందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే మజ్ను సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అను ఇమ్మానుయేల్. నాని హీరోగా వచ్చిన ఈ మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఎంతోమంది బడా డైరెక్టర్ల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.
వరుస సినిమా అవకాశాలు వచ్చినా ఆ సినిమాలన్నీ ఫ్లాప్ కావడంతో అను ఇమ్మానుయేల్కి అవకాశాలు తగ్గాయి. ఇక తాజాగా మెగా హీరోతో ప్రేమాయణం నడుపుతుందని.. మెగా ఇంటి కోడలు కావడానికి సిద్ధంగా ఉందంటూ యేడాదిన్నరగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వరుస ప్లాపులతో కొనసాగుతున్న అను ఇమ్మానుయేల్ ఊర్వసి రాక్షసి సినిమాలో మెగా హీరో అల్లు శిరీష్ తో కలిసి నటించింది.
ఈ సినిమా షూటింగ్ టైంలో వీరు ప్రేమలో పడ్డారని.. ఇప్పటివరకు సీక్రెట్ గా ప్రేమించుకున్న వీళ్ళు ఇంట్లో ప్రేమ విషయాన్ని చెప్పారని.. వీళ్ళిద్దరి పెళ్ళికి ఇంట్లో వాళ్ళు కూడా అంగీకారం తెలిపారని ప్రచారం నడుస్తోంది. అయితే అల్లు అరవింద్ ఈ పెళ్లి విషయంలో కాస్త బెట్టు చేయడంతోనే లేట్ అయ్యిందంటున్నారు. ఏదేమైనా వరుణ్ – లావణ్య పెళ్లి తర్వాత అను ఇమ్మాన్యుయేల్ – అల్లు శిరిష్ పెళ్లి కూడా జరగబోతుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.