అక్కినేని నాగార్జున నట వారసుడుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నాగచైతన్య. దిల్ రాజు బ్యానర్లో వాసువర్మ డైరెక్షన్లో జోష్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన చైతుకి ఈ సినిమాతో అంతగా సక్సెస్ రాలేదు. ఆ తర్వాత సమంత హీరోయిన్గా డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏ మాయ చేసావే సినిమాలో నటించాడు చైతు.
యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాగచైతన్య కార్తీక్ అనే యంగ్ డైరెక్టర్ రోల్లో నటించగా సమంత.. నాగచైతన్య కంటే పెద్దదైన జెస్సి అనే మలయాళ క్రిస్టియన్ అమ్మాయి రోల్లో నటించింది. గౌతమ్ మీనన్ ఈ సినిమాను తెలుగు, తమిళ్ రెండు భాషల్లోను ఒకే సమయంలో తెరకెక్కించాడు. తమిళ్లో శింబు, త్రిష నటించగా తెలుగులో నాగచైతన్య, సమంత నటించి సూపర్ హిట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఈ సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగచైతన్య తరువాత చాలా సినిమాల్లో నటించి స్టార్ హీరోగా మారాడు. కాగా ఈ సినిమాకు మొదటి ఛాయిస్ నాగ చైతన్య కాదట.. ఈ సినిమాని మొదటిగా గౌతమ్ మీనన్ మహేష్ బాబుతో తీయాలనుకున్నాడట. ఈ సినిమా కథను మహేష్ బాబుకు వినిపించగా మహేష్ బాబుకు స్టోరీ నచ్చినా ఈ టైప్ స్టోరీ తన ఇమేజ్కి సెట్ కాదని ఉద్దేశంతో మహేష్ బాబు ఈ సినిమాను సున్నితంగా తిరస్కరించాడట.
ఆ తర్వాత ఈ సినిమా కథ నాగచైతన్య దగ్గరికి వెళ్ళింది. నాగచైతన్య కథ నచ్చడంతో సినిమాకు ఓకే చెప్పాడు. తర్వాత హీరోయిన్గా సమంతను సెలెక్ట్ చేసుకున్నారు. సమంతకు ఇదే మొదటి సినిమా. వీరిద్దరు జంటగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో స్టార్డం సంపాదించుకున్నాడు నాగచైతన్య. ఇలా ఏ మాయ చేసావే సినిమాను రిజెక్ట్ చేయడంతో నాగచైతన్య హీరోగా నిలదొక్కుకోవడానికి పరోక్షంగా కారణమయ్యాడు మహేష్ బాబు.