ప్రస్తుతం చిత్ర పరిశ్రమ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ప్రాజెక్ట్ కె కూడా ఒకటి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న ఈ సినిమాలో ఎందరో అగ్ర నటులు కీలకపాత్రలో నటిస్తుండటం సినిమాకి మరింత ప్లస్ గా మారింది. ఈ సినిమాలో అమితాబచ్చన్, దీపిక పదుకునే వంటి స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే లోకనాయకుడు కమల్ హాసన్ ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్లో కమల్ జాయిన్ అవుతాడు.
మహానటి లాంటి గొప్ప సినిమాను ప్రేక్షకులకు అందించిన నాగ్ అశ్విన్ ఈ సినిమాను కూడా అదే రీతిలో హాలీవుడ్ రేంజ్ లో టైం ట్రావెల్ సినిమాగా తెరకెక్కిస్తున్నాడు. ఆదిత్య 369 లాంటి సైన్స్ ఫిక్షన్ ప్రాజెక్టును ఎప్పుడో 25 ఏళ్ల క్రితమే తెరకెక్కించి సినిమా లోకంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాకు సాయం అందిస్తున్నారు.
ఇక ఈ సినిమాలో ప్రభాస్కు జంటగా దీపిక పదుకునే హీరోయిన్గా నటిస్తుంది. అలాగే సెకండ్ హీరోయిన్ గా దిశాపటాని ప్రభాస్ పక్కన జోడీ కట్టింది. ముందుగా ఈ సినిమాలో దీపిక పదుకునే కాకుండా మరో టాలీవుడ్ స్టార్ హీరోయిని అనుకున్నారట. స్టార్ హీరోయిన్ మరి ఎవరో కాదు సమంత. అయితే ఆ పాత్రకు బాగా సూట్ అవుతుందని నాగ్ అశ్విన్ భావించి ఆమె దగ్గరికి వెళ్లి కథ కూడా వివరించారట.
అదే సమయంలో సమంత- నాగచైతన్యతో విడాకులు వంటి వరుస చిక్కుల్లో ఉండి ఈ సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేసిందట. ఆ సమయంలో సమంత ఒకవేళ తన ఆలోచన మార్చుకొని.. ప్రాజెక్ట్ కే సినిమాను ఒప్పుకుని ఉంటే ఆమె కెరీర్ ఖచ్చితంగా మరో లెవల్కి వెళ్లి ఉండేది. అలాంటి మంచి అవకాశాన్ని ఆమె వదులుకుంది.
ఇక సమంత తర్వాత ఆ పాత్రను పలువురు హీరోయిన్లు అనుకున్న ఫైనల్ గా దీపిక పదుకునే సెలెక్ట్ అయింది. ఇక మరి ఈ సినిమాతో ప్రభాస్ నాగ్ అశ్విన్ ఎలాంటి మ్యాజిక్ రిపీట్ చేస్తారో చూడాలి. వైజయంతీ మూవీస్ బ్యానర్పై అగ్ర నిర్మాత చలసాని అశ్వనీదత్ రు. 600 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.