పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం పవన్ నటిస్తోన్న సినిమాలే ఏకంగా నాలుగు సెట్స్ మీద ఉన్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్సింగ్, క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక తన మేనళ్లుడు సాయిధరమ్ తేజ్తో కలిసి నటిస్తోన్న మల్టీస్టారర్ సినిమా బ్రో వచ్చే నెల 28న రిలీజ్ కానుంది.
అలాగే సాహో దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో నటిస్తోన్న ఓజీ సినిమా కూడా ఇప్పటికే 50 శాతంకు పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఓజీ ముంబై గ్యాంగ్వార్ నేపథ్యంలో ఉండే కథ. ఇందులో పవన్ గ్యాంగ్స్టర్గా కనిపించబోతున్నాడు. పవన్కు జోడీగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఓజీ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ యేడాది డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ఓజీ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ యేడాదిలో పవన్ ఫ్యాన్స్కు రెండు సంబరాలు షురూ కానున్నాయి. వచ్చే నెలలో పవన్ – సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా 28న రిలీజ్ అవుతోంది.
ఇక ఓజీ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, శ్రియ రెడ్డి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఏదేమైనా ఈ యేడాది రెండు రిలీజ్లు.. అందులోనూ ఐదు నెలల తేడాలో పవన్ రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుండడం టాలీవుడ్ థియేటర్లకు మంచి న్యూస్. ఇక పవన్ ఫ్యాన్స్ సంబరాలు మాత్రం అస్సలు ఆపలేం.