ఎన్టీఆర్ వద్దకి వెళ్లి బోరున ఏడ్చేసిన రాశీఖ‌న్నా … అసలు ఏమైందంటే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చివరగా నటించిన త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పటినుంచి ఎన్టీఆర్ గురించి ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఎన్టీఆర్ ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో దేవ‌ర సినిమాలో న‌టిస్తున్నాడు. ఆ త‌ర్వాత ఎన్టీఆర్ కేజీయ‌ఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో కూడా పాన్ ఇండియా సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ జై ల‌వ‌కుశ సినిమా షూటింగ్‌లో ఓ ఆసక్తిక‌ర స‌న్నివేశం జ‌రిగింద‌ట‌. ఆ సినిమా హీరోయిన్ రాశీఖ‌న్నా – తారక్ దగ్గరికి వెళ్లి ఒక‌ విషయంలో భోరున‌ ఏడ్చేసింద‌ట‌. రాశీ టాలీవుడ్‌లో ఊహ‌లుగుస‌గుస‌లాడే సినిమాలో హీరోయిన్ గా ప‌రిచ‌యం అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని ఫ్లాప్ సినిమాలు రావడంతో రాశీకి సినిమా ఛాన్సులు తగ్గాయి.

ప్రస్తుతం మరిన్ని ఛాన్సుల‌ కోసం బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సన్నగా మారి గ్లామర్ ఫొటోస్ షోస్‌తో సోషల్ మీడియాలో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తుంది. ఎన్టీఆర్‌కు జోడీగా ఆమె నటించిన జై లవకుశ సినిమాలో నివేద థామస్, ఆమె హీరోయిన్‌లుగా నటించారు. ఈ సినిమాలో ట్రింగ్ ట్రింగ్ అనే ఒక పాట ఎంతో పెద్ద హిట్. ఈ పాటలో కొరియోగ్రాఫర్ రాశీఖ‌న్నా కంటే ఎన్టీఆర్ కి ఎక్కువగా స్టెప్స్ ఇస్తున్నాడ‌ని.. తనకి స్టెప్స్ సరిగా ఇవ్వడం లేదని ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి ఏడ్చేసిందట.

దీంతో ఎన్టీఆర్ కొరియోగ్రాఫర్ దగ్గరికి వెళ్లి నాకు తక్కువ స్టెప్స్ ఇవ్వండి.. ఆ అమ్మాయికి ఎక్కువ స్టెప్స్ ఇవ్వండి అని చెప్పారట. అప్పుడు రాశీ భయపడి… వద్దు నాకు ఎక్కువ స్టెప్స్ ఇస్తే నీ ఫ్యాన్స్ నన్ను ట్రోల్ చేస్తారు అంటూ ఎన్టీఆర్‌తో చెప్పిందట. దీంతో తాను కామ్ అయిపోయారని.. ఈ ఇన్సిడెంట్ ఒక ఫ‌న్నీ ఇన్సిడెంట్‌గా ఎన్టీఆర్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.