చిత్ర పరిశ్రమలో కొన్ని కొన్నికాంబోలు భలే సెట్ అవుతూ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఒక్కసారి ఆ కాంబో సెట్ అయి అభిమానులకు నచ్చితే. ఆ తర్వాత ఈ కాంబో ని క్రేజీ కపుల్గా మార్చేస్తారు. ఇప్పుడు ఈ లిస్టులోకే వస్తారు నటసింహం బాలకృష్ణ, సార్ట్ హీరోయిన్ నయనతార. ఈ కాంబోకి ఉన్న ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
అంతేకాకుండా ఇద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అవడంతో పాటు ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా రావాలని ప్రేక్షకులు ఎంతగానో ఆశపడుతున్నారు. ఇప్పటికే బాలయ్య నయనతార కలిసి సింహ, శ్రీరామరాజ్యం, జై సింహా వంటి హిట్ సినిమాల్లో నటించి అభిమానులను అలరించారు. తాజాగా మరోసారి బాలయ్య- నయనతార కాంబో రిపీట్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం టాలీవుడ్ లోనే జెట్ స్పీడ్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు బాలయ్య. ఇప్పటికే తన 108వ సినిమాను అనిల్ రావిపూడితో చేస్తున్నాడు. రీసెంట్ గానే ఈ సినిమాకు భగవంత్ కేసరి అనే మాస్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సమయంలోనే బాలయ్య తన 109వ సినిమాను సైతం మెగా దర్శకుడు బాబీ డైరెక్షన్లో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పూజ కార్యక్రమాలు కూడా ఎంతో ఘనంగా జరిగాయి.
ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా నయనతారను తీసుకోబోతున్నారని ఓ న్యూస్ బయటకు వచ్చింది. నిజానికి ఈ సినిమాలు ఇద్దరు హీరోయిన్లు ఉంటారని. మొదటి హీరోయిన్గా నయనతారను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. ఇక దీంతో ప్రస్తుతం ఇదే న్యూస్ చిత్ర పరిశ్రమలో వైరల్గా మారింది. ఇక మరి ఈ క్రేజీ కాంబో నాలుగో సారి ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.